Showing 181 – 200 of 203 Records
Translation: ENG
వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
[31-12-2002] "పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ప్రత్యక్ష ద్విషః" అని శ్రుతి. అనగా దేవతలు సహితము ఎదురుగా నున్న దానిని ద్వేషింతురు. పరోక్షముగా ఉన్నదానిని ఆరాధింతురు. ఇక మానవుల విషయము చెప్పనేల? దేవతలు, ఋషులు సహితము ‘అసూయ’, ‘అహంకారము’ అను రెండు మహా సర్పదంపతుల బారిన పడక తప్పదు. జీవునికి గల షడ్గుణములలో చిట్ట చివరిది మాత్సర్యము. దీనిని ఎవ్వరును అతిక్రమించలేరు.
దేవతల అంశ గల పాండవులు సహితము స్వామి ఎన్ని విధముల బోధించినను గయుని వదలి పెట్టమన్నారు. స్వామి చెప్పినదే వేదము...
గురువు శిష్యులకు బోధించినపుడుగాని లేక అపమార్గమున ఉన్న సాధకులను సరియగు మార్గమునకు తెచ్చుటగాని చేయునపుడు వారి యొక్క మానసిక తత్త్వమును అనుసరించి బోధలను చేయవలసివచ్చును. సత్యమిది అని చెప్పినచో ఆ సత్యమును ఒక్కసారి జీర్ణించుకొనలేరు. ఒక పెద్దబండను చూపి దీనిని ఎత్తుకొనవలెను అని చెప్పినపుడు దానిని చూచి దానిని నేను ఎత్తలేనని శిష్యుడు వెనుదిరిగిపోవును. అదే బండను చిన్న చిన్న రాళ్ళుగా పగులకొట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరాయిని ఎత్తమన్నచో శిష్యుడు...
[24-01-2003] పరమాత్మ యొక్క అనుగ్రహము పొందినపుడు భక్తిని చూపించుట నిజమైన భక్తి కాదు. మనకు లాభము చేయు వారి మీద ప్రేమను చూపుట, సత్యమైన ప్రేమ కాదు. ఎదుటివారు మన సుఖమునకు కారణమైనందున వారిపై మనము చూపు ప్రేమ అది నిజముగ వారిపై ప్రేమ కాదు. అది మన మీద మనకున్న ప్రేమయే. మనలను మనము ప్రేమించుట వలననే మనకు సుఖమునిచ్చెడి వస్తువులను వ్యక్తులను ప్రేమించుచున్నాము. కావున ఇది ఆత్మప్రేమయే తప్ప పరప్రేమ కాదు...
‘‘అపి చేత్స దురాచారః భజతే మామ్ అనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్యః సమ్యక్ వ్యవసితోసి హి సః ||’’
అని గీతలో స్వామి చెప్పినారు. అనగా ఎంత దురాచారుడైనను మరియొక వస్తువును గాని, మరియొక వ్యక్తిని గాని కోరక ఏ జీవుడు నన్నే భజించునో, అట్టి జీవుడే నిజమైన పుణ్యాత్ముడు. అతడు చేసినది పుణ్యమే కదా! అనగా ఎంతటి పాపియైనను, స్వామియొక్క భక్తుడైనచో పుణ్యాత్ముడనియు...
“బహూనాం జన్మనామన్తే” అనగా ఎన్నో జన్మల తపస్సాధన ఉన్నగాని నన్ను గుర్తించలేరు అనియు "యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః"" అనగా అష్టసిద్ధులు సంపాదించినను, ఎట్టి అహంకారమును పొందక నా కొరకు సాధన సాధించు ఏ ఒక్కడో నన్ను గుర్తించును అని గీత చెప్పుచున్నది. అసలు బ్రహ్మమును గుర్తించు బ్రహ్మవిద్యలో అంత కష్టము ఏమున్నదని ఎవరికైనను సంశయము రావచ్చును.
కొందరు బ్రహ్మము నిరాకారమైన, సర్వవ్యాపకమైన చైతన్యమనుచున్నారు. చైతన్యము కాంతి వలె ఒక శక్తిస్వరూపము. పట్టపగలు కాంతి ఎట్లు సమస్తలోకములను వ్యాపించి యున్నదో, అట్లే చైతన్యము అను శక్తి ఈ సమస్తవిశ్వమును వ్యాపించియున్నది. ఇది అర్థము చేసుకొనుటలో పెద్ద కష్టమేమున్నది? ఎంత పామరుడైనను అయిదు నిమిషములు ఆలోచించినచో, ఇది అర్థమగుచునే ఉన్నది. పదవతరగతి ఫిజిక్సు చదివిన విద్యార్థి ఈ విషయమును ఒకే నిమిషములో అర్థము చేసుకొనగలడు...
[28-01-2003] హిందూమతమున ప్రధానముగా మూడుమతములు ఉన్నవి. అవియే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము. హిందూమతము ఒక మానవ శరీరము వంటి పిండాండము. పిండాండమే బ్రహ్మాండమని పండితులు చెప్పుదురు. పిండాండమైన నరశరీరములో ఉన్న పదార్థములే బ్రహ్మాండమున ఉన్నవి. జడమైన పంచభూతములు అనబడు అపరాప్రకృతి, చైతన్యమగు పరాప్రకృతి రెండింటిలోను తత్త్వములే సమానముగా ఉన్నవి. కావున హిందూమతమును పోలి విశ్వమతములు...
[11-01-2003] సంసారమను ఈ దుకాణములో ధనము, తల్లితండ్రులు, భార్యాభర్తలు, సంతానము, గురువు, బంధువులు, మిత్రులు అను వస్తువులున్నవి. ఈ వస్తువులతో పాటు నరాకారమున వచ్చిన భగవంతుడను వస్తువు కూడ ఉన్నది. ఈ వస్తువులలో నీవు ఏ వస్తువుకు ఎక్కువ విలువనిచ్చావు? అన్ని వస్తువులకన్నను భగవంతునికే ఎక్కువ విలువనిచ్చినప్పుడు ధర్మము అను మరియొక వస్తువు కూడ ఈ దుకాణములో కనపడును. భగవంతుడను వస్తువు లేనప్పుడు అన్ని వస్తువుల కన్ననూ, ధర్మమే ఎక్కువ విలువగలిగినది. కాని భగవంతుడు అను వస్తువుతో ధర్మమను...
[10-01-2003] సాధకుని యొక్క గొప్పతనము అతడు చేసిన సాధన యొక్క గొప్పతనము మీద ఆధారపడియుండును. ఆ సాధన యొక్క గొప్పతనము ఆ సాధకుడు పొందిన ఫలము యొక్క గొప్పతనముపై ఆధారపడి యుండును. ఒకడు సాధించిన ఉద్యోగము యొక్క హోదా జీతమును పట్టి అతడు చదివిన చదువును నిర్ణయించవచ్చును. ఆ చదువు యొక్క గొప్పతనము బట్టియే అతని గొప్పతనముండును. ఈ సృష్టిలో పరమాత్మ నుండి అత్యుత్తమ ఫలమును పొందిన సాధకులు ఇద్దరే ఇద్దరు. వారు హనుమంతుడు మరియు రాధ. హనుమంతుడు 14 లోకముల యొక్క ఆధిపత్యమును...
సరే! దత్తుడు ఏల నిత్యము మనుష్యరూపమున ఉన్నాడు? దీనికి కారణము - దత్తుడనగా దానము. అనగా త్యాగము. దత్తుడు ఎల్లప్పుడును తన భక్తుల దుష్కర్మఫలములను అనుభవించి వారలకు నిత్యసుఖమును కలుగచేయుచున్నాడు. అయితే భక్తులచేత వారి దుష్కర్మఫలమును నూటిలో ఒక్కపాలు మాత్రమే అనుభవింపచేయుచున్నాడు. ఏలననగా కర్మ చేసినవాడు ఆ మాత్రమైననూ అనుభవించకపోవుట పరమదారుణమైన అన్యాయము. ఐతే భక్తులు ఆ ఒక్క పాలును కూడా అనుభవించు ఓర్పులేక...
శ్లో|| గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురు స్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||
ఈ శ్లోకము త్రిమూర్త్యాత్మకుడగు శ్రీ దత్తాత్రేయుడే గురువని స్పష్టముగా చెప్పుచున్నది. "గు" కారము అనగా అంధకారము "రు" కారము అనగా ఆ అంధకారమును పారద్రోలు ప్రకాశము అనగా అజ్ఞానమను అంధకారమును జ్ఞానము అను ప్రకాశము చేత పోగొట్టువాడని అర్థము. శ్రుతి కూడ "సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ" అనగా అనంతమైన...
నాయకుడు తన ప్రజల యొక్క శ్రేయస్సును కోరి సదా శ్రమించవలయును. కాని ఈ రోజు నాయకులు ప్రజల గరించి చింతించక తాము ధనమును సంపాదించి, తమ ఆత్మోద్ధరణమునకు, తమ కుటుంబసభ్యుల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. కాని రాధ అటువంటి నాయకురాలు కాదు. ఏ స్త్రీ కూడా తనకు ప్రియమైన వానిని ఇతర స్త్రీలు పంచుకొనుటకు ఒప్పుకొనదు. కాని రాధ కృష్ణునిపై తన ప్రేమ ఇతర గోపికలకు పంచెడిది. అట్లు వారు ఉద్ధరింపబడుట కోరెను. ఆమె యొక్క త్యాగభావముతో కూడిన మధురప్రేమ చేతనే కృష్ణుడు...
[అనఘాష్టమి సందేశము, 27-12-2002] గురు స్వరూపము ఎప్పుడును శిష్యులు చేయు తప్పులను ఎత్తి చూపుచుండును. శిష్యుల యొక్క సద్గుణములను శిష్యులు సాధించినది గాని ప్రశంసించడు. శిష్యుడు చేసిన తప్పులను మాత్రమే వివరించి ఆ తప్పులు మరల జరగకుండా దిద్దుకొని శిష్యుడు పై స్థాయికి చేరవలయునని గురువు ఎప్పుడును ఆలోచించుచుండును. నూటికి 99 మార్కులు తెచ్చుకున్నను గురువు దానిని ప్రశంసించడు. ఆ తప్పిపోయిన ఒక మార్కు గురించే విశ్లేషించును. ఆ ఒక్క మార్కు తప్పిపోయినందుకు శిష్యుని ఉత్తేజపరచును. ఆ ఉత్తేజముచేత మరల పరీక్షలో...
[03.12.2003] మనము సంసారములో ఆచరించగలుగుచున్న విషయములను భగవంతుని విషయములో ఆచరించలేక పోతున్నాము. ఎట్టి బంధుత్వము లేని దూరదేశములలో ఉన్న ఇరువురు స్త్రీ పురుషులు వివాహము చేసుకొనగనే ఆ స్త్రీ పురుషులు వారి వారి రక్తబంధములగు తల్లితండ్రులు సోదరులను మరచిపోవుచున్నారు. దీనికి కారణము ఆ ఇరువురి బంధము ఇరువురికిని క్షణిక సంతోషమునకు...
[12-01-2003] పరమాత్మ నరావతారమున భూలోకమునకు వచ్చినపుడు ఆయన మానవుల భక్తికి పరవశించుచుండును. ఈ భక్తి మద్యమును సేవించి ఆ మైకములో వారు కోరిన వరములు ప్రసాదించుచుండును. ఎంత నిష్కామ భక్తిని కలిగియున్నను ఎప్పుడో ఒకప్పుడు మానవుని యొక్క నైజము బయటపడక మానదు. "ఆ నైజమే స్వార్థము". ఆ స్వార్థముతో కోరు వరములతో ఒక్కొక్కసారి భగవంతునికే కాక ఆ కోరిన మానవునకే అనర్థము వాటిల్లును. భస్మాసురుడు కోరిన వరమట్టిదియే కదా! దాని వలన స్వామికి ముప్పు...
శ్రీ కృష్ణ భగవానుడు ప్రదర్శించిన విశ్వరూపమును అర్థము చేసుకొనుటయే సర్వ వేదముల యొక్కయు సర్వ శాస్త్రముల యొక్కయు సారమై యున్నది. శ్రీ కృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించక ముందు కూడ విశ్వరూపముతోనే యున్నాడు. విశ్వరూపమును ఉపసంహరించిన తర్వాత కూడ విశ్వరూపముతోనే యున్నాడు. అర్జునుని యొక్క దృష్టి మాత్రమే మారినది. సూర్యుడు ఎప్పుడును ప్రకాశించుచునే యున్నాడు. నల్ల కళ్ళజోడు పెట్టగనే ప్రకాశము లేని ఒక బింబమాత్రునిగా గోచరించుచున్నాడు. ఆ కళ్ళజోడు తీయగనే మరల చూచుటకు వీలు కాని మహాప్రకాశముతో మండుచున్నాడు. నీవు నల్ల కళ్ళజోడు పెట్టినపుడు సూర్యుని…
[08.01.2003] బ్రహ్మ జ్ఞానము లేక బ్రహ్మ విద్య అనగా పరమాత్మను గుర్తించుట. "ప్రజ్ఞానం బ్రహ్మ" అని శ్రుతి. అనగా చైతన్యము బ్రహ్మము అని. ప్రజ్ఞాన శబ్దమునకు ‘చైతన్యము’ అను సామాన్య అర్థములో చెప్పినారు. చైతన్యము అనగా సర్వ ప్రాణులయందు సంకల్పాదులను చేయు ఒక విశేషమైన ప్రాణ శక్తి. ఈ చైతన్యమే బ్రహ్మము అని అన్నప్పుడు ఇందులో అర్థము చేసుకొనుటలో ఎట్టి కష్టము లేదు. కొంచెము భౌతిక శాస్త్రము చదివినవాడు శక్తుల యొక్క తత్త్వములను బాగుగా అధ్యయనము చేసినవాడు దీనిని సులభముగా అర్థము చేసుకొనగలడు. ఇదే బ్రహ్మజ్ఞానము లేక బ్రహ్మ విద్య యైనచో...
"మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరమ్, కథయన్తశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ" అని అన్నారు స్వామి భగవద్గీతలో. దీని అర్థము నా యందే మనస్సును ప్రాణములను నిలిపి నా గురించి ఒకరికి ఒకరు చెప్పుకొనుచు ఆ కథలలోని నా కథలను తత్త్వమును లేక అంతరార్థమును బోధించుకొనుచు ఆనందముతో నా భక్తులు నిత్యము రమించు చుందురు అని ఈ శ్లోకార్థము. మనస్సు పరమాత్మ యందు ఎప్పుడు లగ్నమగునో అప్పుడే స్వామికి నీ వాక్కు, దేహము, ప్రాణములు కూడ అర్పించ బడుచున్నవి. ప్రాణము వాయు స్వరూపమై యున్నది...
గురు దత్త నామములో గురు శబ్దము జ్ఞానమునకు, దత్త శబ్దము దానమునకు నిలచియున్నది. జ్ఞానమే వేదము. వేదమే విద్య. విద్య యొక్క ఫలమే వినయము. మరియు జ్ఞానము సత్త్వగుణము వలన పుట్టును. "సత్త్వాత్ సంజాయతే జ్ఞానం" ప్రకారముగా జ్ఞాన కారణమే సత్త్వగుణము. సత్త్వగుణము యొక్క తత్త్వము అహంకారరాహిత్యమే. అనగా వినయమే. కావున గురుదత్త శబ్దము వినయముతో కూడిన దానమును సూచించుచున్నది. రజోగుణముతో కూడిన దానము అహంకారముతో కీర్తి ప్రతిష్ఠల కొరకు స్వార్థముతో కూడి యుండును. కాని గురుదత్తుని తత్త్వము గుప్తదానమై యున్నది. అనగా దానము చేసి తన పేరును బయిటకు రానీయకుండుట. ఇదే సాత్త్విక వినయము. ఈ సృష్టిలో ఏ మంచి కర్మ జరిగినను, ఏ మహిమ జరిగినను...
[దత్త జయంతి సందేశము 07.12.2003] దత్తుడనగా భక్తులకు దర్శన, స్పర్శ, సహవాస, సంభాషణలు అనుగ్రహించుటకు; భక్తుల దుష్కర్మ ఫలములను ఆకర్షించుకొని, అనుభవించి, వారలను కష్ట విముక్తులను చేసి వారి సాధనలను నిర్విఘ్నముగా జరుపుకొనుటకును నరాకారమున అందించబడిన అవతారము. ఏ రాముడో, కృష్ణుడో మాత్రమే దత్తుడు అంటే కుదరదు. ఏలననగా ఒక మనుష్య తరమునకే దత్తుడు పరిమితమైనచో మిగిలిన మనుష్య తరములకు సమానమైన న్యాయము...
“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అని వేదము. స్వామి సత్యమైన అనంతమైన బ్రహ్మము అని చెప్పుచున్నది. స్వామి అంటే గురు దత్తుడే. నీకు ఇష్టమైననూ, కాకున్ననూ దత్తుడు సత్యమునే బోధించును. ఇందుకే ఇంతవరకు దత్తుడు ప్రసిద్ధికి రాలేదు. అయితే ఇప్పుడు ప్రసిద్ధికి వచ్చుచున్నది. కారణమేమనగా ఈ మధ్య ప్రజలు సత్యము యొక్క విలువను గుర్తించుచున్నారు. సత్యము యొక్క ఫలము నిజముగా, శాశ్వతముగా యుండును. సాధారణముగా దేవునితో జనులు వ్యాపార సంబంధమును...