Showing 81 – 100 of 203 Records
Translation: ENG
వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
Updated with Part-2 on 28 Feb 2025
[05-01-2004] వేదము, భగవద్గీత ఈ రెండును సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. భగవంతుని చేరే మార్గము ఏమి? భగవంతుని ఏ స్వరూపములో మనము ఆరాధించాలి? అనే రెండు ప్రశ్నల మీద మన రెండు కన్నులు పెట్టి దృష్టి సారించాలి.
భగవంతుని చేరే మార్గము కర్మయోగము లేక సేవ. ఇది రెండు భాగములుగా యున్నది. ఒకటి – కర్మసంన్యాసము. అనగా మనము మన కుటుంబ నిమిత్తము నిత్యము అనేక కర్మలను చేయుచున్నాము. ఆ కర్మలు చేయగా మిగిలిన సమయము కొంత విశ్రాంతి...
ప్రేమ, మోహము పరమాత్మ సృష్టించిన తేనె. ఆ తేనెను పరమాత్మకు అర్పించక నీవు సంసారమునకు అర్పించుచున్నావు. చాలామంది గురువులు ఈ సంసార వ్యామోహమును దగ్ధము చేయవలయునని చెప్పుతుంటారు. దగ్ధము చేయవలసినది సంసార బంధమునుగాని వ్యామోహమును గాదు. తేనెను సంసారమను సీసా నుండి పరమాత్మయను సీసాలో పోయవలయును గాని తేనెను పారపోయమని కాదు. సంసారమను...
[25-04-2004 ఉదయం 7 గంటలకు] రామానుజులు కులాభిమానమును జూపిన భార్యను త్యజించినారు. పరకుల ద్వేషము లేక, నారాయణ మంత్రమును అందరికిని అన్ని కులములకును ఉపదేశించినారు. కులాభిమానమే పోనిచో ఈ కుటుంబము వరకే నాది అన్న కుటుంబాభిమానము...
భాగవతము పరమ పవిత్రగ్రంథము. దత్తుని ఆజ్ఞననుసరించి అనఘాదేవి, ఆదిపరాశక్తి, గొల్లభామగా అవతరించినది. పతి, పుత్ర, ధనాది బంధములను పంచభూతమయములును, మనోమయములును అగు 6 చక్రములను ఎటుల దాటి స్వామి వద్దకు చేరవలయునో అభినయించి చూపినది. ఆ తల్లి, తన బిడ్డలను ఉద్ధరించుటకై మరొక జీవుని భర్తగా స్వీకరించు అవమానమును సైతము అంగీకరించినది. అయితే జీవులందరునూ...
[03-08-2000] భగవంతుడిని ఆవాహనము చేసి విసర్జించిన (ఉద్వాసన) చెప్పిన వాని ఇంటికి మరల ఎప్పుడు భగవంతుడు రాడు కావున వాడు ఆవాహనము చేయుట వ్యర్థము. అటులనే ఉద్వాసన చెప్పని వాని ఇంటి నుండి భగవంతుడు ఎప్పుడును...
[14-04-2004] నిజమైన భక్తుడు ఒక్క ఉన్మదావస్థలోనే భగవంతుని చేరగలడు. కృష్ణావతారములో రాధ ఒక్కతే ఆ ఉన్మదావస్థకు చేరుకున్నది. దశరథుని చూడండి – సత్యవాక్య పరిపాలనకే ప్రాధాన్యము ఇచ్చాడు. ఆయన రాముని భగవంతుడని విస్మరించాడు. కనుక భగవంతుని...
స్వామి సమాధానము: లోకములో కర్మఫలములను అనుభవించుచున్న జీవులను చూసినప్పుడు మనకు వారిపై ఎంతో సానుభూతి కలుగును. ఏలననగా వాని కర్మఫలానుభవమును చూచుచున్నామే గానీ వాడు వెనుక చేసిన కర్మలను చూడలేదు. ఒక హంతకుని ఉరితీయుట చూసినప్పుడు దీనముగా ఏడ్చుచున్న వానిని చూసి జాలిపడుదుము. ఆ ఉరిశిక్ష వేయు అధికారులు...
[అర్జునుడు ఏకలవ్యుని చూచి అసూయ చెందినాడు అట్టివానికి విశ్వరూపమును చూపి స్వామి ముక్తి నొసగినాడు. ఇది స్వామికి తగునా?]
స్వామి సమాధానము: స్వామి అర్జునుడికి విశ్వరూపమును చూపుటయే ముక్తి అని నీకు నీవే నిర్ణయించినావు. విశ్వరూపమును ధృతరాష్ట్రునికి కూడా చూపినాడు. కానీ ధృతరాష్ట్రుడు ముక్తుడైనాడా? స్వామి యొక్క దర్శనము చేత కానీ, స్పర్శనము చేతగానీ, సహవాసము చేతగానీ, సంభాషణము చేతగానీ ముక్తి లభించదు. ఆయన యొక్క అనుగ్రహము చేతనే ముక్తి లభించును. రావణుడు శివుని దర్శించెను. కానీ శివాగ్రహమునకు గురియై పుత్ర, కళత్ర, మిత్ర సమేతముగా అకాల మరణము...
[21-02-2003] స్వామి సమాధానము:- కాలము గడుచుచున్న కొలదీ ధర్మదేవత మరియు జ్ఞానదేవత యొక్క బలము రోజు రోజుకూ తగ్గుచున్నది. కావున జీవుల యొక్క అజ్ఞానము పెరుగుచున్నది. ఈ అజ్ఞానముతో పాటు విజ్ఞానము కూడా పెరుగుచున్నది. అజ్ఞాని అనగా పూర్తిగా తెలియని
[25.07.2001] గాయత్రి అనగా భజనయే. అల్పమైన సంగీతములో భగవంతుని గుణగణముల ప్రాధాన్యతను సూచించు శబ్దములతో, ఆ శబ్దములనే త్వరత్వరగా పలికి, ఆ శబ్దార్థములైన భగవంతుని గుణముల మీద ఆసక్తితో, ఆ శబ్దముల మధ్య వచ్చు సంగీతశాస్త్రపు కసరత్తులతో గల దీర్ఘరాగములపై...
[09.05.2000 ఉదయము 6 గంటలకు] నారాయణుడనగా ‘నారం జ్ఞానమ్ అయనం యస్య సః’ అని అర్థము. అనగా జ్ఞానమునకు ఆశ్రయుడని, గురుస్వరూపమనియే అర్థము. ‘సత్యం జ్ఞానం...’ అను శ్రుతికి ఈ వ్యుత్పత్తి సమన్వయించుచున్నది. అయితే నారాయణుడే బ్రహ్మ అని, నారాయణుడే శివుడనియు ‘బ్రహ్మా చ నారాయణః, శివశ్చ నారాయణః’ అని శ్రుతి చెప్పుచున్నది. ఈ జ్ఞానియే బ్రహ్మ, అనగా చాలా గొప్పవాడు, ఈ జ్ఞానియే పరమపవిత్రుడను అర్థము గల శివుడు...
[11.03.2000 ఉదయం 5గంటలకు] ‘య ఏత దుదర మంతరం కురుతే–అథ తస్య భయం భవతి’ అని శ్రుతి. ఎవరు భేదాలను పాటిస్తారో వారు అంత్యమున నరకమునబడి భీతులగుదురు. ఏకత్వమే బ్రహ్మత్వము. కులము, జాతి, మతము–ఈ మూడు భేదములతో కూడిన అజ్ఞానమే బ్రహ్మ జ్ఞానమునకు అవరోధము. దీనిని దాటలేకపోయినచో బ్రహ్మజ్ఞానము పూర్ణము కాదు. దీనినే శంకరాచార్యులకు దత్తసద్గురువు చండాలరూపములో బోధించారు. ప్రతి కులమునందును సజ్జనులున్నారు, దుర్జనులున్నారు...
[10.03.2000 ఉదయము 5 గంటలకు] కాలభైరవుడు స్వామిగా కల కాపాలికమతము చాలా పవిత్రము. దానిలో శవభక్షణము అనగా ఏ ప్రాణియైనను సహజముగా మరణించిన తరువాత తినుట అనునది సాధారణము. సంవత్సరాంతమున మొక్కలు పండి ఎండుచున్నవి. అవి శవములు. వాటిని కోయుట పాపము కాదు...
Updated with Part-3 on 11 Feb 2025
వానప్రస్థాశ్రమము యొక్క అంతరార్థము చాలా ఉన్నది. గృహస్థాశ్రమమున పుత్రపౌత్రాదులను ఎట్లు పోషించినావో అట్లే వానప్రస్థాశ్రమమున పశు, పక్షి, వృక్షాదులను పోషించవలెను. ‘నివసన్నా వసథే పురాద్బహిః’ ప్రకారముగా నగరమునకు బయట నున్న చిన్నతోటలో నివసించవలెను. దీని వలన వృక్షముల నుండి వెలువడు శుద్ధప్రాణవాయువు లభించి ఆరోగ్యము బాగుగ నుండి శక్తి పెరుగును. నగరములో విషవాయువులు తప్ప శుద్ధప్రాణవాయువు లభించదు. వృద్ధదశ రాగానే శక్తి క్షీణించి...
Updated with Part-2 on 08 Feb 2025
జపము అనగా భగవంతుని యొక్క నామమును పదే పదే ఉచ్చరించుట. మనము లోకములో ఒకరి యొక్క నామమును ఎప్పుడు ఉచ్చరించుచున్నాము? మనము వారిని పిలువ వలసివచ్చినప్పుడు ఆ నామమును పలుకుచున్నాము. రామయ్య అను వ్యక్తిని పిలువవలసి వచ్చినప్పుడు ఆ పేరును ఉచ్చరించుచున్నాము. అట్లే భగవంతుని పిలువ వలసివచ్చినప్పుడు ఆయన నామమును ఉచ్చరించుట సహజమైయుండును. ఇంతకు తప్ప ఒక నామమును ఉచ్చరించుటలో లోకములో ఏ ప్రయోజనమూ...
Updated with Part-4 on 06 Feb 2025
[25-02-2003] భారతదేశము ప్రపంచములోని అన్ని దేశములకన్న ఎంతో మిన్న అయినది. అలానే ప్రపంచమతములలో హిందూమతము గురుస్థానమును వహించినది. ఇచ్చట జరిగినంత తత్త్వశాస్త్రము యొక్క చర్చ ఏ దేశములోనూ, ఏ మతములోనూ జరుగలేదు. భారతదేశము సర్వవిశ్వమునకూ, అలానే హిందూమతము సర్వమతములకూ ప్రతినిధిగా ఉన్నది. ఏలననగా భారతదేశములో వివిధ మాతృభాషలు గల రాష్ర్టములు ఎన్నో వున్నవి. అలానే హిందూమతములో వైష్ణవము, శైవము...
గురుస్వరూపము కాని భగవత్తత్త్వము లేదు. ఆస్తికుడై పాపములు చేయువానికి బోధించి వానిని పూర్తిగా దిద్దుటకు స్వామి, నరకము, యముడు, కాలభైరవులను బెత్తములను ఉపయోగించును. కొట్టియైనా చదివింప ప్రయత్నించు గురువుకే నిజమైన వాత్సల్యమున్నట్లు గదా. కావున నరకాదులు స్వామి యొక్క గురువాత్సల్యాతిశయమునే సూచించును. ఇక గురువు నెదిరించు శిష్యునికి గురు విశ్వాసమును బోధించు రీతిగా చేసి, నాస్తికునకు తానవతరించి అష్టసిద్ధులను చూపుచూ వానిని కూడ దిద్దుటకు...
భారతయుద్ధము అమావాస్యనాడు ప్రారంభించబడినది అని లోకములో ఒక కథ ప్రచారములో ఉన్నది. అటువంటి లోకములో ప్రచారములోనున్న కథను ప్రమాణముగానే తీసుకుందాము. ఈ కథలో సూర్యచంద్రులను ఒక చోటకు రప్పించి, వారిద్దరి కలయిక ద్వారా చతుర్దశి నాడే అమవాస్యను కృష్ణుడు కల్పించినాడని ఉన్నది. దీని చేత గ్రహములను కూడ పరమాత్మ అధిగమించినాడని...
[10-02-2004 స్వభానునామ సంవత్సరము మాఘ కృష్ణ విదియ సోమవారము 3.30pm] పరమాత్మ పశు, పక్షి, మృగాలను సృష్టించిన తరువాత మానవులను సృష్టించెను. ప్రతి మానవుడును ఈ ప్రాణుల గుణములన్నియును కలిగియున్నాడు. ఈ గుణములన్నియును వివిధములైన పాళ్ళలో కలిసిన త్రిగుణముల మిశ్రమములే. ఆ త్రిగుణములే సత్త్వము, రజస్సు, తమస్సు. ఈ మూడు గుణములే సర్వసృష్టి స్వరూపమైయున్నది. గుణములన్నియు భావరూపములే. కావున పరమాత్మ...
[21.03.2000] విగ్రహారాధనమును ఆర్య–బ్రహ్మ సమాజస్థులు, క్రైస్తవులును, ముస్లింలును నిరసించుచున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. సర్వశక్తిమంతుడగు భగవంతుడు ఎట్లు అవతారముల నెత్తుచున్నాడో, అట్లే భగవంతుడు విగ్రహముల నావేశించి భక్తుల అవసరముల కొరకు వారి ఆరాధనల నందుకొనుచున్నాడు. కావున తర్క ప్రకారముగ ఇందులో ఏ ఆక్షేపణయునులేదు.
పూర్వపక్షము (Opponent):- ‘అరూపమవ్యయమ్’, ‘న చక్షుషా’, ‘అరూపవదేవ హి’ ఇత్యాది ప్రమాణములన్నియు బ్రహ్మము...