స్వామి రచించిన 'గోపి గీతలు' గ్రంధము నిండి కొన్ని భజనలు.
(మమ్ములను మరచినావని గోపికలు అన్న మాటను ఉద్ధవుడు వచ్చి చెప్పగా విని వేదనతో)
మరచి పోతివనుచు గోపి! - ఎంత మాట పలికినావు ! (పల్లవి)
ఉద్ధవుండు చెప్పె నాకు - అట్లు పలుకు సమయమందు |
కమలనయన కెంపులందు - జలము ధారలయ్యె ననుచు |
నన్ను నేనె మరతునేమొ - నిన్ను ఎట్లు మరువగలను |
బృందలోని యమున సాక్షి - అ తమాల తరులు సాక్షి ||