Showing 1 – 20 of 248 Records
Translation: ENG
వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
ఉపసంహారము
హిందూమతము శైవ, వైష్ణవ, శాక్తేయ ఆది అనేక మతముల సమన్వయముతో ప్రకాశించుచు, ప్రపంచములోనున్న అనేక మతముల సమన్వయముతో రావలసిన విశ్వమతమును సూచించు సందేశము నిచ్చుచున్నది. హిందూమతములోని మతగ్రంథములగు వేద, పురాణ, బ్రహ్మసూత్ర, ధర్మసూత్ర ఆది శాస్త్రగ్రంథములను ఇతర దేశస్థులగు ఇతర మతముల వారు తమ భాషలలోకి అనువదించుకొని, ఆ గ్రంథములలోగల ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క ఔన్నత్యమునకు ఆశ్చర్యపడుచున్నారు...
21. అహింస పరమధర్మము గౌరవ ప్రదము:
గుణానుసారముగా, ఆసక్తిని ఆధారము చేసుకొని, బాధ్యతలను పంచి ఏర్పరిచిన కులవ్యవస్థలో ఎట్టి దోషము లేదు. వీటి మూలముగా కులములలో హెచ్చు తక్కువలు లేవు. నాలుగు కులములను సృష్టించిన బ్రహ్మయొక్క ముఖము, బాహువులు, తొడలు, పాదములు సమాన అంగములే. దేనిని కొట్టిననూ మిగిలిన వాటికి కూడా బాధకలుగును. ఇంతవరకును నాలుగు కులములకు సమానస్థానము మరియు సమానగౌరవము ఉన్నది. కానీ పరమధర్మమైన అహింసకు విరోధముగా...
20. లింగవివక్ష పూర్తిగా అర్ధరహితము:
కులవివక్షను కొంతవరకైననూ అర్థము చేసుకొనవచ్చును కానీ లింగవివక్ష మరీ అర్థరహితమైనది. ఈ వివక్ష స్త్రీ పురుషుల బాహ్య శరీరములలో కల కొన్ని స్వల్పమైన మాంసవికారములపై ఆధారపడి ఏర్పడుచున్నది. కులవివక్ష కనీసము అంతర్గత గుణములపై ఆధారపడియున్నది. పురుషుడనగా పురము అనబడు శరీరమునందు చైతన్యస్వరూపముగా శయనించిన లేక వ్యాపించిన జీవాత్మయే తప్ప మగమనిషి అని కాదు. పురుషునకు బాహ్యశరీర లక్షణములతో సంబంధములేదు...
19. సమత్వమే న్యాయము:
ఉపనయనము అనగా భగవంతుని సమీపించుట అని అందరికి తెలియును. దీనికి సర్వజీవులకును సమానమైన అధికారమున్నది. జగత్పిత అయిన పరమాత్మను చేరుటకు బిడ్డలందరును అర్హులే. భాషయు, అర్థజ్ఞానము లేని పశు పక్ష్యాదులకు...
18. గుడ్డిగా వేదమును బట్టీపట్టుట - అపార్థములు:
ఉపనయన విషయములో కూడ అర్థము ఏమియు తెలియక బట్టీ బ్రాహ్మణులు అపార్థములను సృష్టించినారు. మలేరియా నిరోధక మందు ప్రచారమును గురించిన శిక్షణ మొత్తము ఇంగ్లీష్లోనే ఉన్నది. ఆ శిక్షణ పొందు ఒక ఉద్యోగికి ఇంగ్లీష్ ఏ మాత్రమురాదు. ఆ ఉద్యోగి, ఆ శిక్షణయే వ్యాధినిరోధక మందు అనియు, ఆ మందును తమకు మాత్రమే లభించినది అనియు ప్రచారము చేసినాడు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని మిగిలిన వారును దానిని నిజమే అని భావించి ఆవేశముతో దూషించుదురు. అట్లే ఈ బట్టీబ్రాహ్మణులు...
17. గుణకర్మానుసారమే కులవ్యవస్థ:
ఉపాధ్యాయులు లోకంలో అందరికీ విద్యాబుద్ధులను అందించు బాధ్యతను అల్పవేతనములున్నను (ఇటీవల కాలము వరకు) నెరవేర్చుచున్నందున వారిని ఇతరులు గౌరవించిరి. ఇతరులు మాత్రము మిగిలిన వృత్తులవైపే పరుగెత్తెడివారు. అల్పవేతనమైనను ఆ వృత్తిపై నీకు మక్కువ ఉన్నచో నీవు నిరభ్యంతరముగా భూరిశ్రవుని వలె రావచ్చును. ఈనాడు ఆనాడుగా ఉన్నచో ఎవరునురారు. జ్ఞానప్రచార వృత్తిని ఆరంభములోనే ఎన్నుకొని దరిద్రముననుభవించుచు వంశపారంపర్యముగా...
16. నిజమైన భూరిశ్రవుడు నేడును అభినందనీయుడే:
“ఈనాడు ఇతరకులములనుండి కూడా బ్రాహ్మణవృత్తిని స్వీకరించు పురోహితులను భూరిశ్రవునివలె ఏల ప్రోత్సహించుటలేదు?” అని వాదించకుము. ఈనాటి వృత్తికిని ఆనాటి వృత్తికిని ఏమాత్రము పోలికలేదు. ఆనాడు ఏమాత్రము ధనాశలేని వేదజ్ఞానప్రచారము. ఈనాడు జ్ఞానములేక బట్టీపట్టి వేదపఠనము ద్వారా ముందుగా నిర్ణయించిన ధనమును సంపాదించుట. ఇట్లు ఈ వృత్తియొక్క అసలు తాత్పర్యమే పూర్తిగా భ్రష్టమైన ఈ కాలములో ఈ వృత్తిని ప్రోత్సహించుట లేక నిరాదరము చూపుట - ఈ రెండును సముద్రములో...
15. ఆక్షేపణలు - సమాధానములు:
స్తుతిని గానము చేయుమని సూచించు జ్ఞానబోధకమగు గాయత్రీ మన్త్రమును పాటగా పాడనవసములేదు. నీవు పాడుము అను మాట పాటగా పాడనవసరములేదు. గాయత్రీమన్త్రమును జపించుటలో ఉద్దేశము ప్రచారములో ముఖ్యమైన జ్ఞానాంశ విషయమును మాటిమాటికీ గుర్తుచేసుకొనుటకే. స్త్రీ, శూద్రాదులకు ప్రాకృతము తప్ప సంస్కృతము భాషించుటకు అర్హతలేదనుట సరిగాదు. శూద్రుడైన భూరిశ్రవుడు, గార్గి, మైత్రేయి, సులభాయోగిని మొదలగు స్త్రీలు సంస్కృత వేదపండితులు...
14. అగ్నికార్యము:
జ్ఞానయోగముద్వారా సద్గురుదేవుని గుర్తించి, భక్తియోగము ద్వారా గానముతో స్తుతించి, కర్మయోగము ద్వారా ఆయనను సేవించుటయే సారాంశము. జ్ఞానభక్తి యోగములు భావరూపములు. కర్మయోగమగు సేవ క్రియారూపము. భావము క్రియను, క్రియ ఫలమును పుట్టించును...
12. మాతృభాషలోనే దైవ స్తోత్రగానము:
ప్రాచీనకాలములో సంస్కృతము భారతదేశములో మాతృభాషగా ఉన్నప్పుడు కూడా ప్రపంచములో ఇతర దేశములు వాటివాటి మాతృభాషలతోనున్నవి. కావున ఏ భాషలోనైననూ దేవుని స్తోత్రముతో గానము చేయవచ్చును. దేవుడు అన్నిభాషలను తెలిసిన సర్వజ్ఞుడు...
11. గాయత్రీ ధ్యానశ్లోకము - యజ్ఞోపవీతము:
గాయత్రీ ధ్యానశ్లోకమగు “ముక్తావిద్రుమ...” అనునది లౌకికమైన శార్దూలవిక్రీడిత ఛందస్సులో ఉన్నది కావున ఇది ఋషిరచన కాదు. అయిననూ అర్థజ్ఞానులగు పండితులచే రచింపబడినదే తప్ప బట్టీబ్రాహ్మణులు చేసిన పనికాదు. కావున ఋషుల జ్ఞానమార్గములోనే ఉన్నది. ఋషులు – పండితులు - బట్టీబ్రాహ్మణులు అను మూడు కాలక్రమ దశలను గుర్తించవలెను. ఈ శ్లోకములో గాయత్రి పంచముఖములు పంచభూతములను సూచించుచున్నవి. త్రిగుణములను సూచించు మూడుచూపులు...
10. గాయత్రీ మన్త్రార్థము
ఈ పూర్వ రంగముతో గాయత్రి అని పేరుగల ఛందస్సులో రచింపబడిన గాయత్రి అను వేద మన్త్రము అర్థమును ముందు మనము విశ్లేషించవలయును.
గాయత్రీ మన్త్రము:
ఓం భూర్భువస్సువః । తత్సవితుర్వరేణ్యం ।
భర్గోదేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ।
ఓమ్ = ఇది అనూహ్య పరబ్రహ్మమును సూచించుచున్నది. (తస్యవాచకః - బ్రహ్మసూత్ర). ఇది సృష్టిస్థితిలయ...
9. ఉపనయనము:
ఉపనయనము అనగా జ్ఞాన, స్తుతి, సేవలద్వారా భగవంతునికి దగ్గరగా అగుట. బుద్ధితో విశ్లేషణమను జ్ఞానయోగముద్వారా గుర్తించవలసిన భగవంతుని స్వరూపమును నిర్ణయించి, భక్తియోగముద్వారా మానసిక ఆవేశమును కలుగజేయు భక్తిగీతములతో ఆయనను స్తుతించి, పాకముచేసి అర్పించుట మొదలగు కర్మయోగ సేవలద్వారా నరాకారము లోనున్న దైవ రూపమగు సద్గురువును సమీపించుటయే ఉపనయనము. రూఢిద్వారా ఉపనయనము అనగా అర్థమును తాము తెలియక...
8. శబ్దార్థము - సందర్భము:
యోగము, యౌగికము మరియు యోగరూఢము: శబ్దార్థమును విచారించుట యోగము అనబడును. అట్లు విచారించబడిన అర్థము దానిచే పిలువబడు వస్తువులో కనిపించినచో అట్టి వస్తువు యౌగికము అనబడును. యౌగిక వస్తువు ఒకటియే ఉండవచ్చును లేదా ఎక్కువగా ఉండవచ్చును. ఉదా.: పంకజము అనగా బురదనుండి పుట్టినది అను అర్థమును తెలియుట యోగము.
i) బురదనుండి పుట్టిన యౌగికమైన వస్తువు ఒకటియే ఉండవచ్చును...
7. బ్రాహ్మణ వృత్తికి అత్యధిక గౌరవము:
లోకములో ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రచారముచేయు వృత్తిని స్వీకరించిన ఈ బ్రాహ్మణులకు అత్యధిక గౌరవము దక్కినది. ఇది వారి వృత్తికిగల ప్రాధాన్యతను గౌరవించుటయే. జనులలో ఆధ్యాత్మికజ్ఞానము బాగుగ నాటుకున్నచో దైవభక్తితో పాటు దైవభీతియు ఏర్పడును. మరణానంతరము...
6. కులము అనగా ఒకానొక గుణకర్మయే:
కులములు గుణకర్మలననుసరించియే ఏర్పడినవి అనుగీతా ప్రమాణము ప్రకారముగా కులము అనగా ప్రాచీన కాలములో ఒకానొక నిర్దిష్టమైన గుణకర్మయే. గుణమనగా కర్మలోని తీవ్రమైన శ్రద్ధయే. కర్మయనగా సమర్థవంతముగా చేయబడిన కర్తవ్యమే. కులము జన్మచేత కానేకాదు. గీతావచనము ప్రకారముగా సర్వజీవులను సృష్టించిన భగవంతుడే అందరికి తండ్రి వేదములో కూడ భగవంతుని అవయవములుగ వివిధ జీవులు లోకములో నిలచినారు అని చెప్పబడినది. ఒకే తండ్రి సంతానమైన...
5. సమస్యలు - సమన్వయములు:
హిందూమతములో ఏ విషయమును చర్చించినను దానికి రెండు కోణములుండును. i) సత్యజ్ఞానమార్గమైన సత్సంప్రదాయమగు ఋషికోణము. దీనిలో సమన్వయము గోచరించును. ii) అజ్ఞాన - అపార్థ దుష్టసంప్రదాయమగు అర్థము తెలియక బట్టీపట్టిన పురోహితుల...
3. స్వామి దయానంద సరస్వతి సంస్కరణలు:
స్వామి దయానంద సరస్వతి హిందూమతములోని మతాంతరీకరణములను ఆపుటకు కొన్ని సంస్కరణలను చేసినారు. కులము జన్మచేత కాదనియు, ఉపనయనము మొదలగు వైదిక సంస్కారకర్మలు కుల, లింగములకు అతీతముగా అందరికినీ విధించినారు. దీనిచేత తాత్కాలికముగా...
2. దోషములకు మూలకారణము:
అన్ని మతములలోను దోషములు ఏదో ఒక రూపములో ఉండుచునే ఉన్నవి. ఒక మతములో ఒక కోణములో దోషముండును, మరియొక కోణములో గుణము ఉండును. ఈ దోషములను వడపోసి, విసర్జించి పరమతములోని గుణములను తన మతములోనికి...
1. మతాంతరీకరణము వ్యర్థము:
అన్ని మతములు సమానమే మరియు మంచివే. ఏ మతములోనూ అధికముగా ఒక గుణముగానీ ఒక దోషముగానీ లేదు. ప్రతి మతములోనూ దోషములున్నవి. అయితే ఈ దోషములు ఆయా మతములలోని అజ్ఞాన – అహంకార - సంకుచిత జనులు...