
ఉపోద్ఘాతము:- వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
వానప్రస్థాశ్రమము యొక్క అంతరార్థము చాలా ఉన్నది. గృహస్థాశ్రమమున పుత్రపౌత్రాదులను ఎట్లు పోషించినావో అట్లే వానప్రస్థాశ్రమమున పశు, పక్షి, వృక్షాదులను పోషించవలెను. ‘నివసన్నా వసథే పురాద్బహిః’ ప్రకారముగా నగరమునకు బయట నున్న చిన్నతోటలో నివసించవలెను. దీని వలన వృక్షముల నుండి వెలువడు శుద్ధప్రాణవాయువు లభించి ఆరోగ్యము బాగుగ నుండి శక్తి పెరుగును. నగరములో విషవాయువులు తప్ప శుద్ధప్రాణవాయువు లభించదు. వృద్ధదశ రాగానే శక్తి క్షీణించి...
Updated with Part-2 on 08 Feb 2025
జపము అనగా భగవంతుని యొక్క నామమును పదే పదే ఉచ్చరించుట. మనము లోకములో ఒకరి యొక్క నామమును ఎప్పుడు ఉచ్చరించుచున్నాము? మనము వారిని పిలువ వలసివచ్చినప్పుడు ఆ నామమును పలుకుచున్నాము. రామయ్య అను వ్యక్తిని పిలువవలసి వచ్చినప్పుడు ఆ పేరును ఉచ్చరించుచున్నాము. అట్లే భగవంతుని పిలువ వలసివచ్చినప్పుడు ఆయన నామమును ఉచ్చరించుట సహజమైయుండును. ఇంతకు తప్ప ఒక నామమును ఉచ్చరించుటలో లోకములో ఏ ప్రయోజనమూ...
Updated with Part-4 on 06 Feb 2025
[25-02-2003] భారతదేశము ప్రపంచములోని అన్ని దేశములకన్న ఎంతో మిన్న అయినది. అలానే ప్రపంచమతములలో హిందూమతము గురుస్థానమును వహించినది. ఇచ్చట జరిగినంత తత్త్వశాస్త్రము యొక్క చర్చ ఏ దేశములోనూ, ఏ మతములోనూ జరుగలేదు. భారతదేశము సర్వవిశ్వమునకూ, అలానే హిందూమతము సర్వమతములకూ ప్రతినిధిగా ఉన్నది. ఏలననగా భారతదేశములో వివిధ మాతృభాషలు గల రాష్ర్టములు ఎన్నో వున్నవి. అలానే హిందూమతములో వైష్ణవము, శైవము...
గురుస్వరూపము కాని భగవత్తత్త్వము లేదు. ఆస్తికుడై పాపములు చేయువానికి బోధించి వానిని పూర్తిగా దిద్దుటకు స్వామి, నరకము, యముడు, కాలభైరవులను బెత్తములను ఉపయోగించును. కొట్టియైనా చదివింప ప్రయత్నించు గురువుకే నిజమైన వాత్సల్యమున్నట్లు గదా. కావున నరకాదులు స్వామి యొక్క గురువాత్సల్యాతిశయమునే సూచించును. ఇక గురువు నెదిరించు శిష్యునికి గురు విశ్వాసమును బోధించు రీతిగా చేసి, నాస్తికునకు తానవతరించి అష్టసిద్ధులను చూపుచూ వానిని కూడ దిద్దుటకు...
భారతయుద్ధము అమావాస్యనాడు ప్రారంభించబడినది అని లోకములో ఒక కథ ప్రచారములో ఉన్నది. అటువంటి లోకములో ప్రచారములోనున్న కథను ప్రమాణముగానే తీసుకుందాము. ఈ కథలో సూర్యచంద్రులను ఒక చోటకు రప్పించి, వారిద్దరి కలయిక ద్వారా చతుర్దశి నాడే అమవాస్యను కృష్ణుడు కల్పించినాడని ఉన్నది. దీని చేత గ్రహములను కూడ పరమాత్మ అధిగమించినాడని...
[10-02-2004 స్వభానునామ సంవత్సరము మాఘ కృష్ణ విదియ సోమవారము 3.30pm] పరమాత్మ పశు, పక్షి, మృగాలను సృష్టించిన తరువాత మానవులను సృష్టించెను. ప్రతి మానవుడును ఈ ప్రాణుల గుణములన్నియును కలిగియున్నాడు. ఈ గుణములన్నియును వివిధములైన పాళ్ళలో కలిసిన త్రిగుణముల మిశ్రమములే. ఆ త్రిగుణములే సత్త్వము, రజస్సు, తమస్సు. ఈ మూడు గుణములే సర్వసృష్టి స్వరూపమైయున్నది. గుణములన్నియు భావరూపములే. కావున పరమాత్మ...
[21.03.2000] విగ్రహారాధనమును ఆర్య–బ్రహ్మ సమాజస్థులు, క్రైస్తవులును, ముస్లింలును నిరసించుచున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. సర్వశక్తిమంతుడగు భగవంతుడు ఎట్లు అవతారముల నెత్తుచున్నాడో, అట్లే భగవంతుడు విగ్రహముల నావేశించి భక్తుల అవసరముల కొరకు వారి ఆరాధనల నందుకొనుచున్నాడు. కావున తర్క ప్రకారముగ ఇందులో ఏ ఆక్షేపణయునులేదు.
పూర్వపక్షము (Opponent):- ‘అరూపమవ్యయమ్’, ‘న చక్షుషా’, ‘అరూపవదేవ హి’ ఇత్యాది ప్రమాణములన్నియు బ్రహ్మము...
Updated with Part-2 on 29 Jan 2025
ఈనాడు అవతార పురుషులుగా పిలువబడేవారు, గురువులు పేరుకు తగ్గట్లుగా పరిపూర్ణముగా సిద్ధిని పొందనివారు. కీర్తి కోసము శిష్యుల లేక భక్తుల సంఖ్య పెంచుకొనుచూ వారి యొక్క పూజలచేతను, స్తుతులచేతను తమ యొక్క అహంకారమును పెంచుకొనుచు సాధనామార్గములో దారిలోనే పతితులగుచున్నారు. పరిపూర్ణసిద్ధిని సాధించిన సిద్ధుడు వేరు, క్రింద వారిని ఉద్ధరించుటకు దిగివచ్చిన అవతార తత్త్వము వేరు. సాధనలో కొంతదూరము పోయి, కొన్ని సిద్ధులు లభించగనే, వాటిని దుర్వినియోగము...
[15-04-2004 శుక్రవారము7:00] స్వామి యొక్క కార్యమునకు ఇతర సహకారములు అక్కరలేదు. మత్స్యావతారము మొదలు పరశురామావతారము వరకు స్వామి ఒక్కడే తన పనిని తాను చేసుకున్నాడు. రామావతారములో వానర సహాయమును తీసుకున్నాడే గాని నర సహాయమును...
Updated with Part-2 on 26 Jan 2025
[05-02-2003] పరమాత్మ అవతరించునపుడు కన్నులకు పూర్తిగా అజ్ఞానమను గంతను మహామాయచే కట్టించుకుని భూలోకమునకు వచ్చును. ఎట్టి పరిస్థితులలో కూడ ఆ గంతను విప్పరాదని మహామాయను శాసించి వచ్చును. మహామాయ స్వామికి దాసి కావున యజమాని...
[05-03-2004 ఉదయం 8 గంటలకు] కర్మయోగము ద్వారా, ప్రతిఫలము నాశించక నీవు స్వామిసేవను చేసినపుడు స్వామి ఈ లోకములో ఎట్టి ఫలమును అందించక నీ దేహత్యాగానంతరము బ్రహ్మలోకమును ఇచ్చెదనందురు. అప్పుడు అత్యుత్తమ సాధకుడు నేను బ్రహ్మలోకమును ఆశించలేదు. నిన్ను సేవించుటలోనే నేను ఆనందింతును గావున నాకు ఫలము లభించినది. మరియు నీవు ఎచ్చట నున్న అదే బ్రహ్మలోకము అని అంటాడు కాని మరియొక సాధకుడు ఇట్లు తలచును. అసలు బ్రహ్మలోకము...
Updated with Part-3 on 23 Jan 2025
[26.07.2001] Part-1: వైదికులు అగు బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన కర్మ కలాపములలో అనేక దోషములు కలవు. అందులో ఒక ప్రధానమైన దోషమును వివరించుచున్నాను. మనము ఒక ఆరాధనమున ఒక పసుపుముద్దలో కాని, మట్టి విగ్రహము నందు కానీ భగవంతుని ఆవాహనము చేసి ప్రాణప్రతిష్ఠను చేయుచున్నాము. ఆరాధన ముగిసిన వెంటనే ఉద్వాసన చెప్పుచున్నాము. ఇది ఎంత నీచమైన కర్మ? ఒక సాధారణ మానవుని, మనము పిలువకయే వచ్చిన వాడిని, మనము...
Updated with Part-2 on 20 Jan 2025
Part-1: ప్రేమ వేరు మోహము వేరు. ప్రేమ యనగా నీ పుత్రునకు కష్టపడి చదువు చెప్పుట, చదివించుట. ఆ చదువుతో వాడు పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడగుట. మోహమనగా వానికి కాపీలు అందించి వాని బదులు నీవు పరీక్ష వ్రాసి కాని వానిని ఉత్తీర్ణుడుగా చేయుటకు ప్రయత్నించుట. ప్రేమ కర్తవ్య స్వరూపమైన జ్ఞానము. మోహము మోసముతో కూడిన అజ్ఞానము. తుకారాం తన భార్యకు ప్రతిరోజూ భగవంతుని గురించి బోధించినపుడు...
Updated with Part-4 on 17 Jan 2025
Part-1: పురోహితులు దక్షిణలను యాచించరాదు. బీదవానికిని, ధనవంతునకు, ఒకే శ్రద్ధతో సాయపడి, వారిని దక్షిణలను అడుగక, వారు యథాశక్తి ఇచ్చునదియే తాము స్వీకరించవలెను. ధనవంతుడు లోభముతో ఇవ్వడేని, దానిని గురించి చింతించవలదు. నాపై విశ్వాసముంచుము. మీకు అతడీయవలసినది, వేరొకరి చేత నేను ఇప్పింతును. కాలాంతరమున, వడ్డీతో సహా ఆ లోభి యొక్క దక్షిణను అతడు కోల్పోవునట్లు చేసి, అనేక మార్గముల ద్వారా నీకిచ్చిన వేరొకరికి చేర్చెదను. నా పాలనలో పొరపాటు రాదు...
Updated with Part-2 on 13 Jan 2025
[16.3.2000 ఉదయం 6 గంటల 20 నిమిషములకు] ధర్మజిజ్ఞాస లేనిదే బ్రహ్మజిజ్ఞాస లేదు. ధర్మము పునాది. బ్రహ్మము ఇంటి కప్పు. ఈ రెండింటిని కలుపు నాలుగు గోడలే నాలుగు వేదములుగా నున్న జ్ఞానము. పునాది, గోడలు, కప్పు – ఈ మూడును ఒకే ద్రవ్యముతో నిర్మించినట్లు యీ మూడింటిలోను ఒకే భగవత్తత్త్వమున్నది...
Updated with Part-3 on 11 Jan 2025
[16-01-2004] Part-1: ప్రాచీన ఋషులు ప్రకృతిలో నున్న వస్తువులను పరమాత్మకు ప్రతీకలుగా పెట్టి ఉపాసించినారు. దీనికి కారణము ఆ కాలములో పరమాత్మ మనుష్యరూపములో వచ్చు అవసరము లేదు కావున. ఋషులు నేరుగా బ్రహ్మ, విష్ణు, శివ లోకములకు పోయి తేజోరూపులైన బ్రహ్మ, విష్ణు, శివులను దర్శించెడివారు. ఋషులు జ్ఞానములో పరిపూర్ణులు. జ్ఞానములో వచ్చు సంశయములను...
[07-03-2004 ఉదయము 8 గంటలకు] పథ్యములేని ఔషధము వ్యర్థము. ఏలయనగా ప్రతిదినము ఒక గంట సత్సంగము చేయుచున్నావు. ఇది ఔషధసేవ. ఈ సత్సంగమునకు భిన్నమైన కుటుంబ సంబంధమైన మరియు లోకసంబంధమైన విషయములయందు ఆసక్తి చూపుట అజ్ఞానము. ఔషధమను సత్సంగమును సేవించినావు. మరల అజ్ఞానమును అపథ్యాహారమును సేవించుచున్నావు. జలుబు మాత్ర వేసుకున్నావు. జలుబు కొంత ఉపశమించినది. మరల దినమంతయు ఐస్ నీళ్ళను...
Updated with Part-2 on 05 Jan 2025
ఆంజనేయుల వారి దివ్యతత్త్వము ఏమి?
[29.10.2001] Part-1: నిష్కామముగా, అష్టసిద్ధులకు దూరముగా యుండి ఎట్టి సిద్ధులను ప్రదర్శించని శ్రీరాముని పరబ్రహ్మముగా గుర్తించి ఆరాధించటమే ఆంజనేయుని దివ్యతత్త్వము. ఇచ్చట శ్రీరాముని కళ్యాణగుణములే ఆంజనేయుని ఆకర్షించినవి కాని అష్టసిద్ధులు కానే కాదు. అది అత్యుత్తమ మార్గము...
Updated with Part-2 on 03 Jan 2025
[16-12-2002] బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్థము. ఈ సృష్టిలో సృష్టించబడిన పదార్థములలో అన్నింటికన్న గొప్పది చైతన్యము. ఈ చైతన్యమునే “చిత్”, "చిత్తము", "జీవుడు", "క్షేత్రజ్ఞుడు", "శరీరి", "దేహి", "ఆత్మ" మొదలగు శబ్దములచే పండితులు పిలచుచున్నారు. చైతన్యము అన్నింటి కన్న గొప్పది అగుటకు కారణమేమనగా జడపదార్థము చేయలేని కొన్ని పనులను చైతన్యము చేయుచున్నది. చైతన్యము చేయు పనిని బట్టి ఆ చైతన్యమే వేరు వేరు పేరులను ధరించుచున్నది...
Updated with Part-2 on 01 Jan 2025
[30-12-2002] Part-1: శ్రీదత్తభగవానుడు నిరంతరము మనుష్య శరీరమును ఆశ్రయించి యుండును. ఆ మనుష్య శరీరము సామాన్య మానవ శరీరము వలె ప్రకృతి ధర్మములు కలిగి పరిమితమైన శక్తినే కలిగియుండును. దీనికి కారణమేమనగా ఆయన నిరంతరము సద్భక్తులైన సజ్జనుల యొక్క దుష్కర్మ ఫలములను అనుభవించుచు కర్మ...