
ఉపోద్ఘాతము:- వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
[12.12.2003] నాయనా శ్రద్ధగా విను, ఆచరించు, సేవించు, తరించు. బంధములను మనసా త్రుంచివేయుము. అంటే కాషాయవస్త్రములను ధరించి భార్యాబిడ్డలను వదలివేసి, ఇల్లు వదలిపొమ్మని కానేకాదు. ఈ ఐహిక బంధములను మనస్స్ఫూర్తిగా త్రుంచి వేసుకొని నిశ్చలముగా యుండి, ఆ బంధమును భగవంతునిపై పెట్టుకొనుము. "అహంకారమును అంతము చేసి మమకారమును మరల్చునతనికి...
[05.12.2003]
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కరు |
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియాసి మే|| 18-65
మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు |
మామేవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః || 9-34...
ఈ ముగ్గురు గురువులు త్రిమూర్తుల అవతారములు. మధ్వుడు బ్రహ్మ. రామానుజుడు విష్ణువు. శంకరుడు శివుడు. త్రిమూర్త్యాత్మకుడైన శ్రీగురుదత్తుడే ఈ గురుత్రయరూపములో అవతరించాడు. కానీ భారతదేశములోని పండితులందరు ఈ గురుత్రయము యొక్క భాష్యాలలోని అంతరార్థమును గ్రహించక, పరస్పరము కలహించుకొనుచున్నారు. త్రిమూర్తులలో భేదాలను చూపుకుంటూ, గురుత్రయ...
[01-01-2003] హనుమంతుడు వానరజాతిలో అవతరించినాడు కావున ప్రతి కోతిని హనుమంతుడుగా భావించి గౌరవించుచున్నాము. హనుమంతుడు సాక్షాత్కరించినపుడు హనుమంతుని రూపముపై హేళనము, నిర్లక్ష్యము రాకుండా ఉండుటకే ముందుగా వానరములందు పూజ్యభావమును అలవరచుకొనుచున్నాము. అట్లే మానవాకారమున పరమాత్మ అవతరించినపుడు ఆ పరమాత్మను ప్రేమతో సేవించవలయునన్నచో...
[29.11.2003] నాయనా! శ్రద్ధగా విను. ఆచరించి తరించు. మనము భగవంతునికి ఈయగలిగిననది ఇచ్చుట గొప్పకాదు. మనము ఈయలేనిది భగవంతునికి ఇచ్చినపుడే భగవంతునిపై బంధము నిరూపితమగుచున్నది. ఇచ్చుట అనుక్రియలో ఏమియులేదు. ఇచ్చిన వస్తువు యొక్క విలువపై ఇచ్చుట అను క్రియ ఆధారపడి యుండును. పారాయణముల ద్వారా వాక్కులను (prayers), ధ్యానము...
Updated with Part-2 on 12 May 2025
[19.12.2002] వ్యక్తిగతముగా సద్గుణాలతో కొలిస్తే నేను ఒక నరాధముడను. సర్వదుర్గుణ సంపన్నుడను. నిజంగా మీరందరూ బంగారు, వెండితీగెలైతే, నేను ఇనుపతీగెను. ఐతే ఈ ఇనుపతీగెలోకి దత్తుడను విద్యుత్తు ప్రవేశించి అనేక మహిమలను చేయుచున్నది. "యోగ్యులను వదలి అయోగ్యునకు ఇంత మహిమనేల ఇచ్చితివి?" అని నేను శ్రీ దత్తుని ఈనాడు ఉషఃకాలమున ప్రశ్నించితిని. స్వామి చిరునవ్వు చిందించారు. "నిజంగా నీవు పిచ్చివాడవయ్యా!" అని అన్నాను. స్వామికి చురక తగిలినట్లున్నది...
[24-04-2004] దత్తుడు సద్గురువుగా వచ్చినపుడు ఒక్క జీవునియైనా తరింపచేయాలని చూస్తాడు. ఆయన దృష్టి రూపాయిని సంపాదించుకొనుట కాదు. అట్టి దృష్టి కలవారు గురువులు. పదిమంది శిష్యులను పోగుచేసుకొని తలా పదిపైసలు గురుదక్షిణగా స్వీకరించి గురువు రూపాయి సంపాదిస్తాడు. కాని సద్గురువు యోగ్యుడగు ఒక జీవుని నుండియే వాని వద్ద నున్న ఒకే ఒక రూపాయిని తీసుకుంటాడు. ఇచ్చట సద్గురువుకు...
(స్వామి మరియు క్రిస్టియన్ ఫాదర్ మధ్య జరిగిన సంభాషణ)
[13-07-2003]
ఒకసారి స్వామి నరసరావుపేట-విజయవాడ రైలులో ప్రయాణించుచున్నారు. ఒక క్రిస్టియన్ మతస్థుడైన ఫాదర్ కూడా స్వామితో ప్రయాణించుచున్నారు. స్వామి మరియు ఫాదర్ మధ్య జరిగిన సంభాషణ:
ఫాదర్: నాయనా విను, క్రీస్తును నమ్మి ఆరాధించని వారు శాశ్వత...
[13-07-2003] భారతీయ పండితులు కర్మఫలత్యాగమును (sacrifice of fruit of work i.e., money) యుక్తులతో చేసినట్లు నటించుచున్నారే కానీ కర్మఫలత్యాగమును చేయుటలేదు. పరీక్షకు పేపరు, పెన్నువలె ఈ పరీక్షకు కర్మఫలమగు ధనము, నరాకారమున ఉన్న స్వామి కావలయును. ఆహారమును విగ్రహమునకు చేయి చూపించి దానిని ప్రసాదముగా తీసుకొనుటలో స్వామి ఒక్క మెతుకు కూడా తినలేదు. మరియొక్క అతితెలివి ఏమనగా మానవుడు ఆహారమును...
Updated with Part-2 on 07 Jan 2025
Part-1: “మానవ సేవయే మాధవ సేవ” అను వాక్యము సరిగా అర్థము చేసుకొననిచో చాలా ప్రమాదకరము. అన్నము, వస్త్రము, ఔషధములను ఆర్తులకు ఇచ్చుటయే సేవ కాదు. ఆర్తుడు స్వామిచే విధించబడిన తన పూర్వపాపశిక్షలను అనుభవించుచున్నాడు. నీవు వాని పూర్వపాపములను చూడలేదు. ఇప్పుడు శిక్షలను చూచి కరుణించుచున్నావు. నీవు వానికి శాశ్వత సహాయమును చేయలేవు. వానికి జ్ఞానము, భక్తిని దానము చేసి భక్తునిగా మార్చినచో వానికి భగవంతుడే శాశ్వత సహాయము...
[జూలై 13, 2003 సాయంకాలము] ప్రపంచములో ప్రతి మతము నీ దుర్గుణములను పూర్తిగా పోగొట్టుకున్నకాని ఆ మతములో చేరుటకు పనికిరావని చెప్పుచున్నది. ఇది ఆచరణలో అసాధ్యమగుచున్నది. ఏలననగా ఈ దుర్గుణములు అనేక పూర్వసంస్కారములతో కూడిన పర్వతములు. ఈ స్వల్ప మానవజన్మ వీటిని కదలించుటకు సైతము చాలదు. ప్రయత్నముచేత కొంతవరకు వాటిని నిగ్రహించవచ్చును. ఈ దుర్గుణములు ఋషుల మనస్సులలో కూడా నిప్పురవ్వలవలె మెరయుచున్నవి. ఎవరైననూ తనలో...
Updated with Part-2 on 04 May2025
సంకలనము — శ్రీమతి ఎస్.గాయత్రి & చంద్రశేఖర్, కువైట్ 2003.
[జూలై 13, 2003] Part-1: ఈనాడు మీరు అందరును ఈ దివ్య దత్త జ్ఞాన-భక్తి ప్రచారసేవకై నా చరణముల వద్ద గురుదక్షిణలను సమర్పించినారు. గురుపూర్ణిమ నాటి పూర్ణ చంద్రబింబము బంగారము లేక వెండి నాణెమును అనగా ధనమును సూచించుచున్నది. ఇది నీవు గురువుకు సమర్పించవలసిన గురుదక్షిణలను గుర్తుచేయుచున్నది. ప్రతి నెలా గురుదక్షిణనీయవలెనని ప్రతిపూర్ణిమ నీకు చెప్పుచున్నది. గురువు నరుడు కారాదు. అతడు నరరూపమున వచ్చిన నారాయణుడగు సద్గురువు కావలెను. అప్పుడే నీ గురుదక్షిణకు...
Updated with Part-4 on 02-05-2025
Part-1:
[29-03-2003] భక్తిలేని వైరాగ్యము అసంభవము. భక్తి కొరకు ప్రయత్నము చేయవలెనే కాని వైరాగ్యము కొరకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. భగవంతుని రుచి చూసిన తరువాత సృష్టిలో ఉన్న సర్వవస్తువులతో మరియు సర్వవ్యక్తులతో బంధములు వాటి అంతట అవే తెగిపోవును. కావున సంసారబంధములు తెంచుకొనుటకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. నీవు ఎంత ప్రయత్నము చేసిననూ అవి తెగవు. కేవలము సంసార బంధములు తెంచుకున్నంత...
[07-04-2004] దత్తుడు ప్రతిక్షణము జీవులను పరీక్షించుచుండును. ఎట్లు అనగా ఆయన ఆశ్రయించిన మనుష్యశరీరము ప్రతిక్షణము ప్రకృతి ధర్మములను ప్రదర్శించుచు జీవుల విశ్వాసమును కంపింపచేయుచున్నది. కావున ఆయన శరీరము నిత్యపరీక్షాస్వరూపము. త్రిమూర్తి స్వభావములైన త్రిగుణములతో రజోగుణ, తమోగుణములను తరచుగా ప్రదర్శించుచుండును. ఇవి జీవుల యొక్క విశ్వాసము యొక్క పునాదులనే పెకలించుచుండును. నిత్యపరీక్షకు...
[13-04-2004] చైతన్య స్వరూపమగు మాయాశక్తి నుండి సమస్త విశ్వము (whole universe) పరిణామము (modification) గా ఉద్భవించినది. ఈ చైతన్యము నుండియే చైతన్య భిన్నమైన (different from awareness) జడము (inert)లు కూడా మాయ యొక్క విచిత్రతత్త్వము (wonderful nature) వలన ఉద్భవించినవి. ఈ జడములతో సహా విశ్వమంతయు లయమైనపుడు కేవల చైతన్యమే మిగులును. ఇది అద్వైతస్థితి (state of Monism). కాని ఇట్టి అద్వైతస్థితి...
Updated with Part-2 on 24 April 2025
[28-03-2003] Part-1: భగవంతుడు భూలోకమున అవతరించినప్పుడు ఆయన యొక్క సకల కళ్యాణ గుణములు పూర్తిగా ప్రకటించబడవు. షోడశకళ్యాణ గుణములలో కొన్ని కళ్యాణ గుణములు మాత్రమే అవతారములలో ప్రకటించబడినవి. ఆ ప్రకటించబడిన కళ్యాణ గుణములు కూడా పూర్తి స్థాయిలో ప్రకటించబడవు. అవి చాలా తక్కువ స్థాయిలోనే...
Part-1: [26-03-2003] గురుత్వము ముందు ఏర్పడవలెను. ఆ తరువాత గురుత్వములో దైవత్వము సిద్థించును. గురుత్వము కలిగిన వారు మానవుడైననూ కావచ్చును. కాని దైవత్వము కేవలము మానవరూపమున వచ్చిన మాధవునికి మాత్రమే ఉండును. గురుత్వము కేవలము గ్రంథజ్ఞానమునకు మాత్రమే పరిమితమై యుండును. దైవత్వము లేని గురువు బోధించు మాటలు అనుభూతిని కలిగించజాలవు. అవి కేవలము బుద్ధికి పదును పెట్టునే కాని హృదయములోనికి
Updated with part-2 on 20-04-2025
[26-02-2003] గుణకర్మలను బట్టి ఉత్తమత్వము, అధమత్వము సిద్ధించుచున్నవి. గుణములలో శ్రేష్ఠమైన గుణము సత్త్వగుణము. సత్త్వగుణము అనగా సాధుప్రాణులకు అపకారము చేయకుండుట. సాధుప్రాణులు అనగా సత్త్వగుణముతో నుండు నరులు, జంతువులు, పక్షులు, కీటకములు. రజోగుణము అనగా క్రోధమయమైన క్రూరత్వముతో జీవించు రాక్షసులు అనబడు నరులు, జంతువులు, పక్షి, కీటకాదులకు తిరిగి అపకారము చేయుట. శిష్టరక్షణము...
Part-1:
[06-02-2003] శంకరులు మూసిన తలుపుల గుండా లోపలికి వచ్చుట చేత ఆయనను పరబ్రహ్మమని నిర్ణయించలేము. ఏలననగా శాంబరీమాయలను తెలిసిన రాక్షసులు సైతము అట్లు ప్రవేశించగలరు. కావున అష్టసిద్ధులను బట్టి పరమాత్మను నిర్ణయించలేము. అయితే అష్టసిద్ధులను ప్రదర్శించుట చేత అవి చేతకాని మానవుల నుండి స్వామిని వేరుపరచవచ్చును. ఉదాహరణకు, ఒక క్లాసులో...
యజ్ఞోపవీతము, ఉపనయనము, గాయత్రీ మంత్రానుష్ఠానము, వేదాధ్యయనముల వలన బ్రాహ్మణత్వము సిద్ధించదు. ఇవేవీ లేని బ్రాహ్మణకులమున పుట్టిన స్త్రీలు కూడ బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణులు కానిచో వర్ణసాంకర్యము వచ్చినది కదా. బ్రాహ్మణ స్త్రీలను చూచి, ఇతర వర్ణముల వారు, ఈ ప్రక్రియల అంతరార్థమును...