Showing 1 – 20 of 217 Records
Translation: ENG
వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
[01-04-1993] ఆరోజు శ్రీదత్తస్వామి మా చేత శ్రీశైలములో శ్రీభ్రమరాంబ తల్లికి పూజ చేయించారు. ముగ్గురమ్మల చెంత దీపారాధన చేసి శ్రీసూక్తముతో, సౌందర్యలహరి, షోడశీమంత్ర సంపుటితో చిన్న పటం పెట్టించి భ్రమరాంబాతల్లికి కుంకుమార్చన చేయించారు. అపుడు అమ్మ ఇలా వచించింది – “నాన్నా! ఈ పూజలు తులాత్రాసులో తూచితే ఎడమ వైపు సత్యభామ తన ఐశ్వర్యముతో చేసిన పూజ, కుడివైపున రుక్మిణి, తులసి దళంతో చేసిన పూజలాగా ఉన్నది అని చిరునవ్వు...
[14.04.1992] శ్రీశైలములో శ్రీదత్తభగవానులు శ్రీదత్తస్వామి వారి ద్వారా ఈ క్రింది విధముగా వచించారు – “వాయవ్యకోణే సర్పదోష నివృత్తిః”. క్రిందటి రాత్రి వాయవ్యదిశలో సర్పం వచ్చినది. శ్రీదత్తభగవానులు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని రూపములో దర్శనమిచ్చి సర్పదోష నివారణ చేసినట్లు వివరించారు. నాకు, నా శ్రీమతికి అపమృత్యు దోషమును నివారించారు. అపుడు స్వామి చాలా ప్రసన్నులైనారు. వీరిద్దరు నా పుత్ర, పుత్రికలే కనుక వీరి ముందు జీవితం భగవదారాధనలో చక్కగా గడవటానికి వీరికి అపమృత్యు...
[18.08.2004, సా|| 05:30 లకు] నేను (శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి), నా శ్రీమతి, శేషమ్మగారు, లలితగారు కలసి సత్సంగము కోసం శ్రీదత్తస్వామి దర్శనానికి సత్యనారాయణపురం వెళ్ళాము. స్వామి స్నానం చేసి వచ్చి భీమశంకరముగారి ఇంట్లో మధ్యగదిలో కుర్చీలో ఆసీనులైనారు. మేము కూడ కూర్చున్నాము. నేను, నాశ్రీమతి స్వామి పాదసేవ చేసుకున్నాము. స్వామికి అల్పాహారముగా దోసెలు సమర్పించినది నా శ్రీమతి. శ్రుతకీర్తి స్వామికై సమర్పించిన ధోవతి, టవలు, గురుదక్షిణలు స్వామికి సమర్పించాము. మాదంపతుల గురుదక్షిణ...
[26.02.2002 రాత్రి] నాయనా శ్రద్ధగా విను. పూర్వజన్మలో నీవు విష్ణుదత్తుడవు. ఈమె నీ సతీమణి సుశీలమ్మ సోమిదమ్మ. మీకు సాక్షాత్కారము లభించిన సమయములో శ్రీదత్తుడనై నేను –“విష్ణుదత్తా! నీ తపోశక్తి వృథా పోరాదు. నీవు నా కార్యములో పాల్గోని నాసేవ చేయవలెనని ఆజ్ఞ ఇచ్చియుంటిని. మీదంపతులు ఇరువురు ఈ జన్మలో నా కార్యము చేయుటకు నిర్ణయింపబడినారు. కనుక నేను ఉద్యోగము సహితము మానుకొని మొదటిసారి శివరాత్రి...
[24.02.2005] తారణనామ సంవత్సరము, మాఘ శుక్ల పూర్ణిమ, గురువారము] వర్తమాన అష్టమ దత్తావతారులు శ్రీదత్తస్వామి వారి జన్మదినోత్సవ సందర్భమున ఇందిరాటవర్సులో నేను, నాశ్రీమతి, కుమారుడు భాస్కరుతో కలసి శ్రీదత్తస్వామి వారి దర్శనము చేసుకొన్నాము. స్వామి హస్తమస్తకసంయోగము చేసి ఆశీర్వదించారు. శ్రీదత్తదివ్యవాణిని స్వామి ఇలా వినిపించారు – “నాయనలారా! శ్రద్ధగా వినండి. ఇప్పటికి శ్రీదత్తభగవానుడు మూడు పరిపూర్ణ దత్తావతారములలో అవతరించారు...
[03.05.2003] [ఈరోజు నా శ్రీమతి జన్మదినము. నేను (శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి), నా శ్రీమతి కలసి అజయ్ గారి ఇంట్లో ఉన్న శ్రీదత్తస్వామిని దర్శించి సేవించుకున్నాము.] మేము స్వామిని దర్శించుకున్నపుడు స్వామి “పుట్టుటయు నిజము పోవుటయు నిజము, మధ్యన ఉన్నది నాటకము, కానగ కన్నది కైవల్యము” అని పాడి ఇలా వివరించారు. పుట్టుట అంటే నాటకము ప్రారంభము అని అర్థము. పోవుట అంటే నాటకము పూర్తి కాగానే నటులు ఇళ్ళకు వెళ్ళుట అని అర్థము. మధ్యన ఉన్నది నాటకము అంటే నాటకము మధ్యలో కూడ నాటకమే అని అర్థము. ఉదాహరణకు రామారావు, అంజలి ఒక నాటకము వేసారు. అందులో వారు భార్యభర్తలుగా నటించారు నిజమే, కాని విచారిస్తే వాళ్ళు నాటకానికి ముందు...
[26.12.2004] దత్తజయంతి తారణ నామ సంవత్సరము నేను నా శ్రీమతి శ్రీదత్తస్వామివారిని దర్శించాము. ఆరోజు గురువారము. స్వామీ! ఈనాడు దత్తజయంతి కదా! మీరు దయచేయండి. మమ్ము అనుగ్రహించండి అని స్వామివారికి వినతి చేశాము. స్వామి చిరునవ్వు చిందించుచూ ఇలా వచించారు. “శ్రీదత్తభగవానుడు మానుషరూపంలో దత్తస్వామిగా వచ్చి అనుగ్రహిస్తున్నారు గదా! ఈ మానుష తనువుకు జయంతి 24 ఫిబ్రవరి. అదే నిజముగా దత్తజయంతి" అంటూ నవ్వారు. 24.02.2007 కు స్వామికి 60 సంవత్సరములు....
[13.12.1997] "నేను పుట్టితినా? నాకు జయంతి ఉన్నదా?" అంటూ దైవరహస్యాన్ని వెల్లడించారు స్వామి. “అస్మత్ప్రియతమ భక్తులగు శ్రీ విష్ణుదత్తుల వారికి (శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి), శ్రీగురుడు (శ్రీదత్తస్వామి) వ్రాయునది మీరు మా ఆజ్ఞ చేత ఈ లోకమునకు జీవోద్ధరణమునకై వచ్చి క్రింది మెట్టులో నున్నారే తప్ప...
[శ్రీ దత్తస్వామి వారు మా దంపతులకు అనుగ్రహించిన దివ్య ఉపదేశామృతము ఇది].
శ్లో|| ఇంద్రియాదీనాం అగ్రాహ్యం బ్రహ్మ | కించిత్ గ్రాహ్యమ్ ఆశ్రిత్య విద్యుత్ తంత్రీవ అద్వైతం వర్తతే||
తాత్పర్యము: పరబ్రహ్మము ఇంద్రియాదులకు అందనిదైనా, వాటి చేత గ్రహింపబడు ఒకానొక పదార్థమును ఆశ్రయించి తీగయందు వ్యాపించిన కరెంటు వలె దాని కన్న వేరు కాక అద్వైతమై యుండును...
శివలింగము అనగా చిచ్ఛక్తి (wave of awareness) తరంగము. అనగా జీవునిలో ఉండే చిచ్ఛక్తి స్వరూపమే శివలింగాకారమున ఉన్నది. ఈ శివలింగ చిచ్ఛక్తి స్వరూపమే జీవునిలో జఠరాగ్ని స్వరూపమున భాసించుచున్నది. ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః’ ప్రకారముగా అన్నమును పచనము చేసి దాని నుండి చిచ్ఛక్తిని పుట్టించుచు...
[07-04-2005] ఈనాడు సాయంత్రం 4.30 గంటలకు నేను నా శ్రీమతి, మా మనుమరాలు రాధ సత్యనారాయణపురం వెళ్ళి భీమశంకరం గారి ఇంట్లో మా గురుదేవులు శ్రీదత్తస్వామి వారిని దర్శించుకొన్నాము. ఈ సంధర్భములో స్వామి అనుగ్రహించిన దత్తవాణి ఇలా ఉన్నది. నాయనలార! పరబ్రహ్మము మనుష్య శరీరమును ఆవహించి నరావతారములో...
రామకృష్ణాది అవతారములు శుద్ధావతారములు లేక నిత్యావతారములు అనబడును. ఇందులో స్వామి శుద్ధ చైతన్యముతో కూడిన తన సంకల్పముచే సృష్టించబడిన శరీరమును ఆశ్రయించి అవతార జననము మెదలు మరణము వరకు అందులో నిత్యముగా యుండును. ఆవేశావతారములో పరమాత్మ ఒక సామాన్య మానవుని ఆవేశించును. ఇట్టి ఆవేశములో సామాన్య మానవుని శరీరముతో...
For ScholarsPosted on: 16/11/2025Updated with Part-2 on 17 Nov 2025
Part-1: [25.11.2002] అవతారమునందు మూడు తత్వములుండును. మొదటిది పంచభూతములతో నిర్మింపబడి, ఆకారము కలిగిన ద్రవ్యమైన దేహము. ఇదే విష్ణుతత్త్వము. అందుకే విష్ణువును ఆకారముగా పూజించుచున్నారు. ఇక రెండవది శుద్ధ చైతన్యమైన జీవుడు. ఈ జీవుడు శరీరమంతా వ్యాపించి...
Updated with Part-2 on 15 Nov 2025
Part-1: [12.12.2002] "న తత్సమశ్చాభ్యధికశ్చ" అని శ్రుతి. అంటే స్వామితో సమానుడు కాని, అధికుడు కాని లేడు. అట్లే స్వామితో సమానమైన వస్తువు గాని, స్వామి కన్న అధికమైన వస్తువు గాని లేదు అని అర్థము. "త్యాగేనైకే" అను శ్రుతికి పరమాత్మను పొందుటకు నీవు చేయు త్యాగమే కారణమగును అని అర్థము. మరియు "సర్వధర్మాన్ పరిత్యజ్య" అను గీతాశ్లోకము సర్వధర్మములను త్యజించి నన్నే శరణు జొచ్చుము. నిన్ను సర్వపాపములనుండి విముక్తుని చేసెదను అని చెప్పుచు...
For ScholarsPosted on: 11/11/2025Updated with Part-2 on 13 Nov 2025
Part-1:
జ్ఞానులైన మరియు భక్తులైన భగవత్ సేవకులారా
[వృషనామ సంవత్సరము, మార్గశిర బహుళ దశమి, మంగళవారము, ఉదయం 06.00 గంటలకు శ్రీదత్త దివ్యవాణి.]
పంచభూతమయమైన మనుష్యశరీరమును ధరించిన బ్రహ్మర్షులు సైతము యుగయుగముల తపించి, పంచభూతమయసృష్టికి అతీతమైన పరబ్రహ్మస్వరూపమును గ్రహించుట అసాధ్యమని తెలిసి, వారి కొరకు పంచభూతమయమైన మనుష్యశరీరమును ఆశ్రయించిన పరబ్రహ్మమైన...
Updated with Part-4 on 10 Nov 2025
Part-1: జ్ఞానులైన మరియు భక్తులైన భగవత్ సేవకులారా, అత్రి అనసూయలకు మానవస్వరూపములో అందరాని పరబ్రహ్మము అందినరోజే దత్తజయంతి. ‘జయంతి’ అనగా ఆ మానవాకారము సంభవించిన రోజు. అనగా సాక్షాత్కరించిన దినము. అనగా అట్టి మానవాకారములో ఉన్న సద్గురువు నీకు లభించిన రోజు. అట్టి సద్గురువును దర్శించు ప్రతిదినము దత్తజయంతే. అట్టి సద్గురువు సాన్నిధ్యములో ఉండి ఆయనను నిత్యము సేవించు ప్రతిరోజు దత్తజయంతియే. దత్తుడనగ...
Updated with Part-4 on 06 Nov 2025
Part-1: [16.12.2002] నారాయణుడు అనగా ఎవరు? "నారం అయనం యస్య సః నారాయణః" అనగా నారమును ఆశ్రయించిన వాడు నారాయణుడు. "నారము" అనగా ఏమి? నరునకు సంబంధించినదే నారము. నరుడు అనగా అర్థమేమి? ‘‘న రీయతే క్షీయతే ఇతి నరః’’ అనగా నశించని వాడు నరుడు అని అర్థము. నరునకు బాహ్య శరీరము ఉన్నది. దాని యందు వ్యాపించిన చైతన్యము అను జీవుడున్నాడు. శరీరము నశించినను జీవుడు నశించక పరలోకమునకు పోవుచున్నాడు. కావున జీవుడు నిత్యుడు...
For ScholarsPosted on: 31/10/2025Updated with Part-3 on 02 Nov 2025
[30-01-2003] Part-1: ఒకే పరమాత్మ భారతదేశములో గురుత్రయ స్వరూపములలో శంకర, రామానుజ, మధ్వాచార్యుల రూపాలలో అవతరించి బోధించిన బోధలలో అనగా వారు వ్రాసిన భాష్యములలో తేడాలు ఉండుటకు రెండు కారణములున్నవి. మొదటి కారణము పరమాత్మ శంకరాచార్య రూపములో వచ్చినపుడు ఉన్న సాధకుల స్థాయి చాలా దారుణముగ యున్నది. అప్పుడు ఉన్న సాధకులు పూర్వ మీమాంసకులు మరియు బౌద్ధులు. ఈ ఇరువురును నాస్తికులే. పూర్వ మీమాంస "దేవో న కశ్చిత్" అనుచున్నది...
Updated with Part-2 on 30 Oct 2025
Part-1: [09.03.2000 ఉదయం 6 గంటలకు]
బ్రహ్మోఽహం బ్రహ్మదేవోఽహం, బ్రాహ్మణోఽప్యహమేవ చ |
ఇతి మాం యో విజానాతి, బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే ||
అనగా–బ్రహ్మము నేనే. బ్రహ్మదేవుడను నేనే. బ్రాహ్మణుడన్నను నేనే. ఇట్లు నన్ను ఎవరు తెలుసుకొందురో వారే బ్రహ్మజ్ఞానులు. ‘ఏకమేవా ఽద్వితీయం బ్రహ్మ – నేహ నానాస్తి కించన’ అని శ్రుతి. అనగా బ్రహ్మ ఏకము. నానాత్వము (multiplicity) లేదు అని అర్థము. ఏకత్వమును అర్థము చేసుకొనక, జాతి...
For ScholarsPosted on: 27/10/2025Updated with Part-2 on 28 Oct 2025
Part-1: [21-12-2002] శ్రీ దత్త భగవానుడు శంకరులుగా అవతరించినపుడు ఈ దేశమంతయును నాస్తికులతో నిండియుండెను. ఈ నాస్తికులు రెండు విధములుగా యుండిరి. మొదటి విధము వారు పూర్వమీమాంసకులు. వీరు యజ్ఞయాగాదులను మాత్రమే చేయుచు భగవంతుడులేడని వాదించుచుండిరి. వీరి మతము ప్రకారముగా "దేవో న కశ్చిత్ భువనస్య కర్తా" "కర్మానురూపాణి పురఃఫలాని" అనగా ఈ జగత్తు లేక ఈ శంకరుడును లేడు లేడు. వేదములో చెప్పబడిన యజ్ఞములను చేసినచో మనము