Showing 1 – 20 of 208 Records
Translation: ENG
వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
శివలింగము అనగా చిచ్ఛక్తి (wave of awareness) తరంగము. అనగా జీవునిలో ఉండే చిచ్ఛక్తి స్వరూపమే శివలింగాకారమున ఉన్నది. ఈ శివలింగ చిచ్ఛక్తి స్వరూపమే జీవునిలో జఠరాగ్ని స్వరూపమున భాసించుచున్నది. ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః’ ప్రకారముగా అన్నమును పచనము చేసి దాని నుండి చిచ్ఛక్తిని పుట్టించుచు...
[07-04-2005] ఈనాడు సాయంత్రం 4.30 గంటలకు నేను నా శ్రీమతి, మా మనుమరాలు రాధ సత్యనారాయణపురం వెళ్ళి భీమశంకరం గారి ఇంట్లో మా గురుదేవులు శ్రీదత్తస్వామి వారిని దర్శించుకొన్నాము. ఈ సంధర్భములో స్వామి అనుగ్రహించిన దత్తవాణి ఇలా ఉన్నది. నాయనలార! పరబ్రహ్మము మనుష్య శరీరమును ఆవహించి నరావతారములో...
రామకృష్ణాది అవతారములు శుద్ధావతారములు లేక నిత్యావతారములు అనబడును. ఇందులో స్వామి శుద్ధ చైతన్యముతో కూడిన తన సంకల్పముచే సృష్టించబడిన శరీరమును ఆశ్రయించి అవతార జననము మెదలు మరణము వరకు అందులో నిత్యముగా యుండును. ఆవేశావతారములో పరమాత్మ ఒక సామాన్య మానవుని ఆవేశించును. ఇట్టి ఆవేశములో సామాన్య మానవుని శరీరముతో...
For ScholarsPosted on: 16/11/2025Updated with Part-2 on 17 Nov 2025
Part-1: [25.11.2002] అవతారమునందు మూడు తత్వములుండును. మొదటిది పంచభూతములతో నిర్మింపబడి, ఆకారము కలిగిన ద్రవ్యమైన దేహము. ఇదే విష్ణుతత్త్వము. అందుకే విష్ణువును ఆకారముగా పూజించుచున్నారు. ఇక రెండవది శుద్ధ చైతన్యమైన జీవుడు. ఈ జీవుడు శరీరమంతా వ్యాపించి...
Updated with Part-2 on 15 Nov 2025
Part-1: [12.12.2002] "న తత్సమశ్చాభ్యధికశ్చ" అని శ్రుతి. అంటే స్వామితో సమానుడు కాని, అధికుడు కాని లేడు. అట్లే స్వామితో సమానమైన వస్తువు గాని, స్వామి కన్న అధికమైన వస్తువు గాని లేదు అని అర్థము. "త్యాగేనైకే" అను శ్రుతికి పరమాత్మను పొందుటకు నీవు చేయు త్యాగమే కారణమగును అని అర్థము. మరియు "సర్వధర్మాన్ పరిత్యజ్య" అను గీతాశ్లోకము సర్వధర్మములను త్యజించి నన్నే శరణు జొచ్చుము. నిన్ను సర్వపాపములనుండి విముక్తుని చేసెదను అని చెప్పుచు...
For ScholarsPosted on: 11/11/2025Updated with Part-2 on 13 Nov 2025
Part-1:
జ్ఞానులైన మరియు భక్తులైన భగవత్ సేవకులారా
[వృషనామ సంవత్సరము, మార్గశిర బహుళ దశమి, మంగళవారము, ఉదయం 06.00 గంటలకు శ్రీదత్త దివ్యవాణి.]
పంచభూతమయమైన మనుష్యశరీరమును ధరించిన బ్రహ్మర్షులు సైతము యుగయుగముల తపించి, పంచభూతమయసృష్టికి అతీతమైన పరబ్రహ్మస్వరూపమును గ్రహించుట అసాధ్యమని తెలిసి, వారి కొరకు పంచభూతమయమైన మనుష్యశరీరమును ఆశ్రయించిన పరబ్రహ్మమైన...
Updated with Part-4 on 10 Nov 2025
Part-1: జ్ఞానులైన మరియు భక్తులైన భగవత్ సేవకులారా, అత్రి అనసూయలకు మానవస్వరూపములో అందరాని పరబ్రహ్మము అందినరోజే దత్తజయంతి. ‘జయంతి’ అనగా ఆ మానవాకారము సంభవించిన రోజు. అనగా సాక్షాత్కరించిన దినము. అనగా అట్టి మానవాకారములో ఉన్న సద్గురువు నీకు లభించిన రోజు. అట్టి సద్గురువును దర్శించు ప్రతిదినము దత్తజయంతే. అట్టి సద్గురువు సాన్నిధ్యములో ఉండి ఆయనను నిత్యము సేవించు ప్రతిరోజు దత్తజయంతియే. దత్తుడనగ...
Updated with Part-4 on 06 Nov 2025
Part-1: [16.12.2002] నారాయణుడు అనగా ఎవరు? "నారం అయనం యస్య సః నారాయణః" అనగా నారమును ఆశ్రయించిన వాడు నారాయణుడు. "నారము" అనగా ఏమి? నరునకు సంబంధించినదే నారము. నరుడు అనగా అర్థమేమి? ‘‘న రీయతే క్షీయతే ఇతి నరః’’ అనగా నశించని వాడు నరుడు అని అర్థము. నరునకు బాహ్య శరీరము ఉన్నది. దాని యందు వ్యాపించిన చైతన్యము అను జీవుడున్నాడు. శరీరము నశించినను జీవుడు నశించక పరలోకమునకు పోవుచున్నాడు. కావున జీవుడు నిత్యుడు...
For ScholarsPosted on: 31/10/2025Updated with Part-3 on 02 Nov 2025
[30-01-2003] Part-1: ఒకే పరమాత్మ భారతదేశములో గురుత్రయ స్వరూపములలో శంకర, రామానుజ, మధ్వాచార్యుల రూపాలలో అవతరించి బోధించిన బోధలలో అనగా వారు వ్రాసిన భాష్యములలో తేడాలు ఉండుటకు రెండు కారణములున్నవి. మొదటి కారణము పరమాత్మ శంకరాచార్య రూపములో వచ్చినపుడు ఉన్న సాధకుల స్థాయి చాలా దారుణముగ యున్నది. అప్పుడు ఉన్న సాధకులు పూర్వ మీమాంసకులు మరియు బౌద్ధులు. ఈ ఇరువురును నాస్తికులే. పూర్వ మీమాంస "దేవో న కశ్చిత్" అనుచున్నది...
Updated with Part-2 on 30 Oct 2025
Part-1: [09.03.2000 ఉదయం 6 గంటలకు]
బ్రహ్మోఽహం బ్రహ్మదేవోఽహం, బ్రాహ్మణోఽప్యహమేవ చ |
ఇతి మాం యో విజానాతి, బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే ||
అనగా–బ్రహ్మము నేనే. బ్రహ్మదేవుడను నేనే. బ్రాహ్మణుడన్నను నేనే. ఇట్లు నన్ను ఎవరు తెలుసుకొందురో వారే బ్రహ్మజ్ఞానులు. ‘ఏకమేవా ఽద్వితీయం బ్రహ్మ – నేహ నానాస్తి కించన’ అని శ్రుతి. అనగా బ్రహ్మ ఏకము. నానాత్వము (multiplicity) లేదు అని అర్థము. ఏకత్వమును అర్థము చేసుకొనక, జాతి...
For ScholarsPosted on: 27/10/2025Updated with Part-2 on 28 Oct 2025
Part-1: [21-12-2002] శ్రీ దత్త భగవానుడు శంకరులుగా అవతరించినపుడు ఈ దేశమంతయును నాస్తికులతో నిండియుండెను. ఈ నాస్తికులు రెండు విధములుగా యుండిరి. మొదటి విధము వారు పూర్వమీమాంసకులు. వీరు యజ్ఞయాగాదులను మాత్రమే చేయుచు భగవంతుడులేడని వాదించుచుండిరి. వీరి మతము ప్రకారముగా "దేవో న కశ్చిత్ భువనస్య కర్తా" "కర్మానురూపాణి పురఃఫలాని" అనగా ఈ జగత్తు లేక ఈ శంకరుడును లేడు లేడు. వేదములో చెప్పబడిన యజ్ఞములను చేసినచో మనము
Updated with Part-2 on 26 Oct 2025
[17-12-2002] Part-1: శిష్యుల యొక్క సాధన స్ధితిని బట్టి ఏది చెప్పవలయునో, ఎచ్చట ఆరంభించవలయునో, ఎచ్చట ముగించవలయునో, ఎట్లు చెప్పవలయునో శ్రీ దత్త సద్గురునికి మాత్రమే బాగుగా తెలియును. శిష్యుడు ఉన్న మెట్టు నుండి పైకి ఎక్కవలసిన మెట్టును గురించి మాత్రమే సద్గురువు బోధించును. ఎక్కడో దూరముగ నున్న చిట్టచివరి మెట్టు గురించి బోధింపడు. అట్లు బోధించినచో ప్రయోజనము లేకపోగా శిష్యుడు ఉన్న మెట్టునుండి భ్రష్టుడగును. ఇది గురుబోధలో ఎంతో ముఖ్యమైన విషయము...
Updated with Part-2 on 24 Oct 2025
Part-1: [07.02.2003 శుక్రవారము] ఒక బిందెలో బురద నీరు ఉన్నది. మరియొక బిందెలో సుగంధ జలమున్నది. మరియును సుగంధ జల సముద్రము కూడ యున్నది. బురద నీరు ఉన్న బిందెలోను సుగంధ జలము ఉన్న బిందెలోను, సుగంధ జల సముద్రములోను శుద్ధమైన నీరు ఉన్నది. బురద నీటి బిందెయే జీవుడు. సుగంధ జలమున్న బిందెయే సాధన చేత జీవ గుణములు పోగొట్టుకొని కల్యాణ గుణములను పొందిన జీవుడు...
Updated with Part-2 on 22 Oct 2025
Part-1: [11-12-2002] శ్రీ దత్తుని శివస్వరూపమే శంకరులుగా అవతరించినది. అప్పటి పరిస్థితులు చాలా దారుణముగా ఉండెను. అందరును భౌద్ధమతమును స్వీకరించిరి. బుద్ధుడు కూడా దత్తావతారమే. బుద్ధుడు అవతరించిన సమయమున తత్త్వవిచారణ లేక కేవలము యజ్ఞములను చేయుచు యజ్ఞములలో పశువులను వధించుచున్న రోజులవి. బుద్ధుడు పశువధలనే కాక యజ్ఞములను కూడ మాన్పించినాడు. ఏలననగా...
For ScholarsPosted on: 19/10/2025[16-12-2002] బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్థము. ఈ సృష్టిలో సృష్టించబడిన పదార్థములలో అన్నింటికన్న గొప్పది చైతన్యము. ఈ చైతన్యమునే “చిత్”, "చిత్తము", "జీవుడు", "క్షేత్రజ్ఞుడు", "శరీరి", "దేహి", "ఆత్మ" మొదలగు శబ్దములచే పండితులు పిలచుచున్నారు. చైతన్యము అన్నింటి కన్న గొప్పది అగుటకు కారణమేమనగా జడపదార్థము చేయలేని కొన్ని పనులను చైతన్యము (awareness) చేయుచున్నది. చైతన్యము చేయు పనిని బట్టి ఆ చైతన్యమే వేరు వేరు పేరులను...
[27-01-2003] "బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః" అని గీత. అనగా వసుదేవుని పుత్రుడగు ఈ నరాకారము పరబ్రహ్మమని విశ్వసించు నిశ్చల జ్ఞానము, అనేక జన్మల తపస్సాధన వలన అసూయను పోగొట్టు కొని అనసూయా తత్త్వమును పొందిన ఒకానొక అతిదుర్లభ జీవునకే లభించునని అర్థము. "నాహం ప్రకాశః సర్వస్య యోగ మాయా సమావృతః" అని గీత. నేను మాయచే కప్పబడి యున్నందున అందరు గ్రహించలేరని...
Updated with Part-2 on 17 Oct 2025
Part-1
[01-01-2003] ధనము నీ శక్తి యొక్కయు, నీ సమయము యొక్కయు స్వరూపమై యున్నది. నీ కాలము, శక్తి వ్యయించబడి ధనముగా మారినది. కావున ధనమును దుర్వినియోగము చేసినచో నీ కాల శక్తులను దుర్వినియోగము చేసినట్లే. నీవు భగవంతునికి అర్పించదలచిన ధనము సద్వినియోగము చేసినచో సత్ఫలితమును పొందెదవు. నీవు ధనమును దైవ పూజకు వ్యయించుచున్నావు. పూజ అనగా షోడశోపచారములు ఇంకను రాజోపచారాది అనేక ఉపచారములు. ఉపచారములు...
Updated with Part-2 on 15 Oct 2025
Part-1: [04.02.2003] జీవుడు ఒక బురద నీటి పాత్రవలె ఉన్నాడు. పాత్ర జడ శరీరముగను నీరు శరీరములో ఉన్న శుద్ధ చైతన్యము అగు జీవుడు. ఈ జీవుడే ఆత్మ దేహి శరీరి పురుషుడు, క్షేత్రజ్ఞుడు, పరా ప్రకృతి అను శబ్దములచే చెప్పబడుచున్నాడు. ఈ బురద నీటిలో యున్న మట్టికణములే జీవస్వభావ గుణములు అగు అహంకార మాత్సర్యాదులు. ఇక ఒక సుగంధ నీటి మహా సముద్రమే ఈశ్వరుడు. ఈ సుగంధ జలములోని నీరే శుద్ధ చైతన్యము. బురద నీటిలోని శుద్ధ జలము...
Updated with Part-2 on 13 Oct 2025
Part-1: రామావతారమున కౌసల్యాగర్భమున చేతనమైన శరీరపిండము ఏర్పడినది. ఈ శరీరపిండములో అనేక జన్మ సంస్కార వాసనా రూపమైన విశిష్టజీవుడు లేడు. కేవలము సామాన్య చైతన్యమైన జీవస్వరూపము ఉన్నది. ఈ సామాన్యచైతన్యము సామాన్య జీవస్వరూపమే అనవచ్చునే తప్ప విశిష్టచైతన్య స్వరూపమనరాదు. ఈ సామాన్య చైతన్య స్వరూపములో కేవలము చైతన్యము ఎట్టి మలినములు లేని శుద్ధ జలము వలె నుండును...
[12.03.2003] సౌందర్యము అనునది ఒక కల్యాణగుణము. సౌందర్యము యొక్క ముఖ్యమైన స్థానము ముఖము. ముఖము మనస్సునకు అనుగుణముగా యుండును. అందుకే "face is the index of the mind" అన్నారు. జ్ఞానము, ప్రేమ, శాంతి మొదలగు కల్యాణగుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు కల్యాణగుణములతో పరిపూర్ణమైనపుడు ముఖము నందు సౌందర్యము పరిపూర్ణమగును...