06 Jun 2025
స్వామి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడే.
ఫణి మద్రాసులో ఒక ఉన్నతోద్యోగానికి అందరి బలవంతముతో ఇంటర్వ్యూకు వెళ్ళినాడు. మొదటి ఇంటర్వ్యూ జరిగినది. సెలక్టు అయిన 14 మందిలో ఫణి కూడా ఉన్నాడు. కాని ఫణికి విజయవాడ వదలటం ఇష్టం లేదు. ఎందుకంటే స్వామిసన్నిధిలో నుండి స్వామికి సేవ చేయటమే అతడి జీవితలక్ష్యం. ఇంతలో రెండవ ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. రెండవ ఇంటర్వ్యూకు పోవటానికి సిద్ధమై బయట వేచియున్నాడు. అత్యాశ్చర్యకరంగా శ్రీవేంకటేశ్వరుడు దర్శనమిచ్చారు. "నీకీ ఉద్యోగం ఇస్తాను" అన్నారు. ఫణి వెంటనే “నాకు వద్దు ఈ ఉద్యోగం. విజయవాడలో స్వామిరూపంలో ఉన్న నీ సేవ చేయటమే నా లక్ష్యం” అన్నాడు. శ్రీవేంకటేశ్వరుడు నవ్వుతూ "అవును నీ రూటు వేరులే" అంటూ అదృశ్యమైనాడు. అపుడు ఫణి టైం చూసుకొన్నాడు. సరిగ్గా మధ్యాహ్నం 12 గం॥ ఆ రోజు దత్తజయంతి. ఆ సమయములో స్వామి విజయవాడలో భక్తసందోహంతో ఆసీనులైయున్నారు. సరిగ్గా అదే 12 గం॥ సమయములో స్వామి అజయ్ గారి వైపు తిరిగి "గోవింద గోవింద నామమే చాలు, అన్నపానములేల ఉద్యోగమేల?" అని పాడినారు. అజయ్ గారు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆ సమయానికి తన ఆఫీసులో ఉండవలసినపని ఉండటం చేత దానిని గురించే ఆలోచిస్తున్నారు. వెంటనే స్వామి "నీ గురించి కాదులే, ఫణి గురించి ఇది. మంచి ఉద్యోగమిస్తానని నేను మద్రాసులో ఇప్పుడు చెప్పియున్నాను. కాని వద్దంటున్నాడు. నేనేం చేసేది?" అన్నారు. భీమశంకరం, వసుమతి గారు స్వామికి ఒక కొత్త స్వెట్టరును అర్పిస్తూ నమస్కరించారు. స్వామి నవ్వుతూ, చమత్కారంగా "ఫణి ఫైనల్ సెలక్షన్ కోసం ముందుగా నాకీ బహుమతిని ఇస్తున్నారా ఏమి? అలా అయితే ఇది నాకు వద్దు. ఎందుకంటే ఫణి ఉద్యోగమును ఇస్తానంటే వద్దంటున్నాడు." అని అన్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండానే అర్పించామని వారనగా దానిని స్వీకరించారు. తరువాత రెండవ ఇంటర్వ్యూలో సెలక్టు కానందున తిరిగి వచ్చిన ఫణి, విషయమంతా వివరించగా భక్తులు ఆనందాబ్ధిలో తేలియాడారు. స్వామి శ్రీవేంకటేశ్వరుడు తానేనని నిరూపించటానికి ఈ చిన్న సంఘటన చాలదా?
★ ★ ★ ★ ★