17 Jun 2025
శ్రీకృష్ణ రూపములను తనలో చూపుట.
శ్రీమతి వసుమతి గారు స్వామి చూపే దివ్య దర్శనములచే కంటి భ్రమలను కల్పిస్తున్నారా? (కనుకట్టు విద్య) అనుకొన్నదట. స్వామి ఆమెకు దివ్య దర్శనమునీయ సంకల్పించినారు. కృష్ణాష్టమినాడు, స్వామిని ఆసీనులను చేసి భక్తులు అర్చించినారు. ఆ సమయములో స్వామి శరీరావయవములందు మురళిని వాయిస్తున్న శ్రీకృష్ణ రూపములు వసుమతిగారి కన్నులకు స్పష్టంగా గోచరించినవి. దానితో వసుమతిగారు ఎంతో ఉద్రేకమునకు లోనైనారు. ఆమెపై అభయహస్తమునుంచి స్వామి శాంతింప చేసినారు. అట్లు తాను చేయనిచో ఆమెకు ప్రాణాపాయము కల్గియుండెడిది అని స్వామి మాతో చెప్పినారు.
★ ★ ★ ★ ★