11 Jun 2025
గ్రీష్మమును శమింపచేయుట.
స్వామి సాక్షాత్తు శ్రీదత్తభగవానులే. పంచభూతాలు ఆయన వశవర్తులే. విజయవాడలో ఒక సంవత్సరము గ్రీష్మప్రతాపము తగ్గించమని భక్తులు వేడుకున్నారు. "కాల, కర్మములలో జోక్యము చేసుకొనరాదు అయినా నిరూపణము కొరకు తగ్గింతును" అని స్వామి తాను రచించిన "శ్రీదత్తదేవం యోగాధినాథం - కోటి సుగుణ సుందరాయ" అను భజన చేయించారు. భజన తరువాత ఇట్లు వచించారు. "ఈ సూర్యుని తేజస్సు దత్తుని తేజస్సు చేత ప్రకాశించుచున్నది" అంటూ నిమీలితనేత్రులైనారు స్వామి. ఇంతలో సాయంకాలము 4 గం॥ అయినది.
ప్రచండభానుడు కొంచెం, కొంచెం శాంతిస్తున్నాడా అన్నట్లుంది. ఆకాశము మేఘావృతమైనది. ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి కురిసినది. మరునాటి నుండి ప్రకృతి శాంతించినది. ఆహా! ఎంతటి మహిమ. మరుసటి సంవత్సరము కూడా భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్పందించారు. అలానే చేసారు. ఆ తరువాత సంవత్సరము "కాల చక్రమున, కర్మచక్రమున జోక్యము చేసుకొనరాదని" స్వామి భక్తులకు వివరిస్తూ, "ఇట్టి కోరికలు కోరకండి" అని హితవు చెప్పారు. ఆహా! పంచభూతములు స్వామి వశవర్తులనుటకు ఇది నిదర్శనము కాదా!
★ ★ ★ ★ ★