14 Jun 2025
దత్తదిగంబర దర్శనమిచ్చుట.
[లక్ష్మీ (జడ్జ్ భార్య), మంగ, అమ్మాజీ]
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నివాసి శ్రీమతి మంగగారు స్వామికి ఎంతో ఉత్తమభక్తురాలు. ఆమెకు తరచు స్వామి దివ్యదర్శనాలలో కనపడేవారు. ఒకసారి ఆమె బొంబాయి పోతూ “స్వామీ! నీడలాగ నా వెంట ఉండవా!” అని కోరగా స్వామి "అలానే" అన్నారు. ఆమె బొంబాయి పోతుండగా స్వామి నీడలాగానే వెంబడించినారు. తిరిగివస్తూ రైలులో “ముఖం కనపడకుండా నీడలాగ వద్దు స్పష్టంగా కనిపించమని” స్వామిని కోరగా ఎదురుగా కూర్చున్నారు. విజయవాడ రాగానే దిగిపోయినారు. ఒకసారి స్వామితో ఫోనులో "మీ నిజస్వరూపముతో ఎక్కువ సేపు నిల్చోండి స్వామి!” అనగానే స్వామి దత్తదిగంబర అవధూత పిశాచరూపంతో నిలువగా భయపడి పారిపోయిందట.
మంగగారి ఇంటి పక్కనే నివసించే జడ్జిగారి భార్య స్వామి రచించిన దత్తవేదగ్రంథం చదవగానే, స్వామిని దర్శించకముందే స్వామి ఎదురుగా నిలబడి దర్శనమిచ్చినారు. ఆమె స్వామిని తరువాత దర్శించినది. అలానే ఆమెకు ఒకసారి శివలింగంలో అభిషేక సమయంలో స్వామి స్పష్టంగా కనపడినారట.
రామచంద్రాపురం నుండి స్వామిని చూడాలని వచ్చిన అమ్మాజీ అను భక్తురాలికి, ఊర్ధ్వత్రిపుండ్రాలతో, శంఖ, చక్రాలతో శ్రీమహావిష్ణువుగా స్వామి దర్శనమిచ్చినారట.
★ ★ ★ ★ ★